Dia Mirza : దియామీర్జా దయాగుణం.. ఫారెస్ట్ వారియర్స్ కు 40 లక్షల సాయం!

బాలీవుడ్ బ్యూటీ, డబ్ల్యూటీఐ బ్రాండ్ అంబాసిడర్ దియామీర్జా ఈనెల 9న బర్త్ డే జరుపుకోనుంది. అయితే పుట్టినరోజును పురస్కరించుకొని ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ ముద్దుగుమ్మా.

  • Written By:
  • Publish Date - December 2, 2021 / 03:04 PM IST

బాలీవుడ్ బ్యూటీ, డబ్ల్యూటీఐ బ్రాండ్ అంబాసిడర్ దియామీర్జా ఈనెల 9న బర్త్ డే జరుపుకోనుంది. అయితే పుట్టినరోజును పురస్కరించుకొని ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ ముద్దుగుమ్మా. కరోనా నివారణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.40 లక్షల సాయం చేయాలని నిర్ణయించుకుంది. “ఈ సంవత్సరం నా పుట్టినరోజున, నాకు పువ్వులు, బహుమతులు పంపాలనుకునే వారందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.. ‘వన రక్షకులు’ (అటవీ యోధులు)కి సహాయం చేయడానికి WTIకి విరాళం ఇవ్వండి.” ఇంతకంటే మంచి పుట్టినరోజు బహుమతి మరొకటి ఉండదు! కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన భారతదేశపు ‘గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్’ పేద కుటుంబాలకు మీ బహుమతి సహాయం చేస్తుంది. డిసెంబర్ 9 నుంచి నా పుట్టినరోజుతో ప్రారంభించి, రాబోయే 40 రోజుల పాటు.. నేను ప్రతిరోజు ఒక లక్ష విరాళం ఇస్తాను. మీరు నాతో భాగం పంచుకోండి. చేతనైనా సాయం చేద్దాం.

“అడవి సంరక్షకులు ప్రకృతి సేవలో తమ ప్రాణాలను పణంగా పెడతారు. ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహిస్తూ తరచుగా ప్రమాదాలకు గురవుతారు. అడవి జంతువులు, వేటగాళ్ల దాడులు,  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లకు దారితీసినప్పుడు వీరంతా పెట్రోలింగ్ చేస్తూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ ఏడాది మార్చి, జూన్ నెలలో మనలో చాలా మంది ఇంట్లోనే ఉన్నప్పుడు, వీళ్లు మాత్రం డ్యూటీలు చేయడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దేశంలోని వన్యప్రాణులను సంరక్షించడానికి తమ జీవితాలను ధారపోస్తున్నారు. “వైల్డ్‌ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (WTI) ఫండ్ రూ.100,000 ఎక్స్ గ్రేషియా అందిస్తుంది. అయితే దేశవ్యాప్తాం 200 మందికి మాత్రమే సాయం అందింది. ఇంకా 65 అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. కావున మీరంతా నాతో  చేరి, విరాళం అందించమని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 65 కుటుంబాలకు ఆదుకుందాం’’ అని దియా మీర్జా పేర్కొంది.