Dharmendra: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న వేళ ఆయన కుటుంబం ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేసింది. దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మేంద్ర (Dharmendra) ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన త్వరగా కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
మరణ వార్తలు అవాస్తవం.. ఈషా డియోల్ స్పష్టం
నటుడి కూతురు, నటి ఈషా డియోల్ మంగళవారం (నవంబర్ 11) ఉదయం 9 గంటలకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ శుభవార్తను పంచుకున్నారు. ఈ సందర్భంగా మీడియాలో వస్తున్న తన తండ్రి మరణ వార్తలను ఆమె ఖండించారు.
Our media is so dumbOur country's media has become so useless that because of the fake news they spread, even Dharmendra ji’s daughter had to come forward to give clarification.#Dharmendra#DharmendraDeol pic.twitter.com/RecEQFedEX
— Kavya✨ (@Lekhika99) November 11, 2025
ఈషా తన పోస్ట్లో ఇలా పేర్కొన్నారు. “మీడియా అత్యుత్సాహంలో ఉంది. తప్పుడు వార్తలను వ్యాపిస్తున్నట్లు అనిపిస్తోంది. మా నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన కోలుకుంటున్నారు. మా కుటుంబానికి గోప్యత ఇవ్వాలని మేమందరం అభ్యర్థిస్తున్నాము. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించినందుకు ధన్యవాదాలు” అని రాసుకొచ్చింది. ఆమె అభిమానులు, సినీ ప్రపంచం వ్యక్తం చేసిన అపారమైన ప్రేమ, ఆందోళనకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Red Fort Blast: ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. కేంద్రం కీలక నిర్ణయం!
వెంటిలేటర్పై లేరు.. సన్నీ డియోల్ వివరణ
దీనికి ఒక రోజు ముందు ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా మీడియాలో వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తన తండ్రిని వెంటిలేటర్పై ఉంచారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ప్రతినిధి ద్వారా సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. సన్నీ డియోల్ బృందం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ధర్మేంద్ర గారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన జాగ్రత్తగా వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. అభిమానులు ఈ కష్ట సమయంలో కుటుంబ గోప్యతను గౌరవిస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా ఉన్న ధర్మేంద్ర అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు.
