Guntur Kaaram: మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న గుంటూరు కారం

  • Written By:
  • Publish Date - January 14, 2024 / 10:00 PM IST

Guntur Kaaram: మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ, మహేష్ బాబు నటించిన గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద బాగానే రన్ అవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ డ్రామా. శ్రీలీల కథానాయికగా నటించింది. మేకర్స్ ప్రకారం గుంటూరు కారం రెండు రోజుల్లో దాదాపు 127 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. USAలో, ఈ చిత్రం 2 మిలియన్ మార్క్‌ను దాటింది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి మరియు సర్కారు వారి పాట తర్వాత ఈ ఫీట్ సాధించిన మహేష్ ఐదవ చిత్రంగా నిలిచింది.

యుఎస్‌ఎ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ హీరోలలో ప్రభాస్ తర్వాత అత్యధికంగా 2 మిలియన్ డాలర్ చిత్రాలను సాధించిన ఘనత మహేష్ బాబుదే. గుంటూరు కారంలో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, రావు రమేష్, జయరామ్, జగపతి బాబు, మీనాక్షి చౌదరి, రాహుల్ రవీంద్రన్ మరియు వెన్నెల కిషోర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ స్వరాలు అందించారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత దర్శకుడిగా రాజమౌళి క్రేజ్, ఫాలోయింగ్ హాలీవుడ్ వరకు పాకింది. బాహుబలితో పాన్ ఇండియా వైడ్‌గా సందడి చేసిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌తో ప్రపంచస్థాయిలో సౌండ్ చేశాడు. ఆర్ఆర్ఆర్‌ను రాజమౌళి ఆస్కార్ వరకు తీసుకెళ్లాడు. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చేలా చేశాడు. అలా రాజమౌళి క్రేజ్ ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఉంది. అందుకే మహేష్ బాబుతో చేయబోతోన్న మూవీ మీద చాలా ఫోకస్ పెట్టారు. ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో, ఇండియానా జోనస్ లాంటి బ్యాక్ డ్రాప్‌తో ఓ విజువల్ వండర్‌గా రాజమౌళి ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది రెండు పార్టులుగా రాబోతోంది.