మన సెలబ్రిటీలు కాక బాలీవుడ్(Bollywood) నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు అప్పుడప్పుడు తిరుమలకు(Tirumala) వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. జాన్వీ కపూర్ అయితే రెగ్యులర్ గా కుదిరినప్పుడల్లా వస్తుంది. ఇటీవల షారుఖ్ కూడా తన జవాన్ సినిమా రిలీజ్ ముందు తిరుమలకు వచ్చారు. ఇక కొంతమంది సెలబ్రిటీలు అయితే కాలినడకన వెళ్తారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) కాలినడకన తిరుపతి నుంచి అలిపిరి మార్గం గుండా తిరుమలకు వెళ్లారు. నిన్న రాత్రి దీపికా పదుకొనే, తన సోదరి అనిషా పదుకొనే, తన స్టాఫ్ తో కలిసి తిరుమలకు నడిచి వెళ్ళింది. దీపికా తిరుమలకు నడిచి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు భక్తులు ఆమెతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు.
నేడు ఉదయం దీపికా పదుకొనే వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనుంది. ఇక దీపికా ఈ సంవత్సరం పఠాన్ సినిమాతో భారీ హిట్ కొట్టి, జవాన్ లో కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. త్వరలో హృతిక్ సరసన ఫైటర్ సినిమాతో రానుంది.
Actress #DeepikaPadukone arrived at #Tirupati on Thursday evening, with her sister #Anisha Padukone and chose to reach #Tirumala hill shrine along the Alipiri trekking route.
On Friday morning she will offer prayers and seek the blessings of Lord Venkateswara.#AndhraPradesh pic.twitter.com/XOTUcrRUt4
— Surya Reddy (@jsuryareddy) December 14, 2023
Also Read : Bhanumathi – Savitri : సావిత్రి, భానుమతి చుట్టూ.. ఉత్తమ నటి వివాదం..