బాలీవుడ్ క్యూట్ కపుల్ అయినా రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే ల జంట గురించి మనందరికీ తెలిసిందే. పెళ్లికి ముందే కొద్ది కొన్నేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఆ 2018లో పెళ్లి చేసుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఒకరైన ఈ జంట చూడడానికి ఎంతో చూడముచ్చటగా అన్యోన్యంగా ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈ జంట విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ జంట మధ్య మనస్పర్ధలు వచ్చి ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు అంటూ బాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపించాయి.
అదేవిధంగా ఇటీవలే రణ్వీర్ సింగ్ నగ్న ఫోటో చూపెట్టు కారణంగా వీధి మధ్య దూరం మరింత పెరిగిందని, విభేదాలు కూడా వచ్చాయని వార్తలు వినిపించాయి. అలాగే ఉమైర్ సందు అనే ఒక రివ్యూయర్ ఫిలిం క్రిటిక్ దీపికా పదుకొనే,రణ్వీర్ సింగ్ ల బంధం చెడిందని త్వరలోనే విడాకుల ప్రకటన రానుంది అంటూ ట్వీట్ చేయడంతో ఆ వార్తలకు మరింత ఆద్యం చేకూర్చినట్టు అయింది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా ఆ వార్తలు జోరుగా వినిపిస్తున్నప్పటికీ దీపిక దంపతులు స్పందించకపోవడంతో అభిమానులు ఆ వార్తల్లో నిజా నిజాలు తెలియక అందులోనూ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న రణ్వీర్ తమ విడాకుల రూమర్స్ పై స్పందించాడు. ఈ సందర్భంగా రణ్వీర్ మాట్లాడుతూ..దీపికాతో నాకు 2012లో పరిచయం ఏర్పడింది. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. ఈ పదేళ్లలో తనపై నాకు ఇంకా ప్రేమ పెరిగింది. దీపికా నా లైఫ్లోకి వచ్చిన తరువాత నా జీవితం ఇంకా అందంగా మారింది. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు అని స్పష్టం చేశాడు రణ్వీర్.