ప్రభాస్తో తన సినిమా షూటింగ్ను ప్రారంభించడానికి దీపికా పదుకొణె ముంబై నుంచి హైదరాబాద్ లో అడుగుపెట్టింది. శనివారం తెల్లవారుజామున ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఈ బ్యూటీ ఫొటోలు వైరల్ అయ్యాయి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయనున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా మొదటిసారి ప్రభాస్తో దీపిక నటిస్తోంది. తన కారు నుంచి దిగిన ఆమె స్టైల్ కు నడుచుకుంటూ మీడియా కంటపడకుండా ఉండేందుకు ప్రయత్నించింది. దీపికా లిలక్ కో-ఆర్డ్ సెట్తో తెల్లటి క్రాప్ టాప్లో ధరించి కనిపించింది. మెటాలిక్ లిలక్ హీల్స్, బ్లాక్ హ్యాండ్బ్యాగ్ వేసుకొని ఎలాంటి మేకప్ లేకుండా కనిపించింది. నివేదిత, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కూడా నటించిన నాగ్ అశ్విన్ చిత్రం కోసం తన షెడ్యూల్ ను కంప్లీట్ చేయడానికి హైదరాబాద్ కు వచ్చింది ఈ బ్యూటీ.