Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు కథ సమాప్తం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. 2017లో నమోదైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

Published By: HashtagU Telugu Desk
Tollywood Drug Case

Tollywood Drug Case

Tollywood Drug Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. 2017లో నమోదైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది . మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్‌ ఎనిమిది కేసుల్లో చార్జిషీట్‌ దాఖలు చేసింది. వాటిలో ఆరు కేసులను సరైన ఆధారాలు లేని కారణంగా కోర్టు కొట్టివేసింది.డ్రగ్స్ కేసులో అనుసరించాల్సిన విధానాన్ని పాటించలేదని, ఆరు కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవని బెంచ్ స్పష్టం చేసింది.

ఈ కేసులకు సంబంధించి టాలీవుడ్ నటీనటులను ఎక్సైజ్ అధికారులు నెలల తరబడి విచారిస్తున్నారు. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నటీనటుల నుండి గోర్లు మరియు వెంట్రుకల నమూనాలను సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. వీరిలో పూరీ జగన్నాథ్ శాంపిల్స్‌ను మాత్రమే ఎఫ్‌ఎస్‌ఎల్‌ పరిశీలించగా.. వారి శరీరంలో డ్రగ్స్‌ ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు 6 కేసులను కొట్టివేస్తూ ఈరోజు తీర్పు వెలువరించింది.

Also Read: CM Revanth: విధ్వంసమైన తెలంగాణను పునర్‌‌ నిర్మించాల్సిన అవసరం ఉంది, ఐపీఎస్​ల గెట్‌ టు గెదర్ లో రేవంత్

  Last Updated: 01 Feb 2024, 11:02 PM IST