Chiranjeevi : ఫోటో చెబుతున్న సీక్రెట్.. సినిమా అనౌన్స్ చేయడమే లేట్..!

Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల వేగాన్ని పెంచారు. ప్రస్తుతం చిరంజీవి యువ దర్శకుడు వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తుండగా ఆ సినిమా తర్వాత మరో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నట్టు

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 08:15 PM IST

Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల వేగాన్ని పెంచారు. ప్రస్తుతం చిరంజీవి యువ దర్శకుడు వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తుండగా ఆ సినిమా తర్వాత మరో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మెగా 157 రేసులో ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ వస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ బ్యానర్ తో చిరు పెద్ద కూతురు సుస్మిత కలిసి ఓ సినిమా చేయనున్నారట.

రీసెంట్ గా చిరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూస్తే వీరి కాంబినేషన్ సినిమా దాదాపు ఫిక్స్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు. అయితే ఈ బ్యానర్ లో వచ్చే సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది మాత్రం తెలియట్లేదు.

అంతకుముందు కళ్యాణ్ కృష్ణ, వెంకీ కుడుముల ఇద్దరితో సినిమా చేస్తాడని చిరు డిస్కషన్స్ చేయగా కథ ఓకే అనిపించేలా ఉన్నా కథనం విషయంలో సాటిస్ఫై అవ్వక చిరు ఆ ప్రాజెక్ట్ లను హోల్డ్ లో పెట్టారు. మరి ఇప్పుడు పీపుల్ మీడియాతో చిరు చేస్తున్న సినిమాకు డైరెక్ట్ ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి యువ దర్శకులతోనే సినిమాలు చేయాలని కోరుతున్నారు.