Chiranjeevi Wife: ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు భార్య సురేఖ.. నెట్టింట వీడియో వైరల్?

  • Written By:
  • Publish Date - February 19, 2024 / 10:30 AM IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాజాగా సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు మెగా కుటుంబ సభ్యులు అలాగే మెగా అభిమానులు పలువురు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన భార్య పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక కవిత్వం కూడా రాశారు. నా జీవన రేఖ..నా సౌభాగ్య రేఖ..నా భాగస్వామి సురేఖ అంటూ భార్య సురేఖకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు చిరంజీవి. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి దంపతులు అమెరికా ట్రిప్ లో ఉన్నారు.

ఇక అత్తయ్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా కోడలు ఉపాసన స్పందిస్తూ.. ఆతమ్మాస్ కిచెన్ పేరుతో జాయింట్ ఆన్‌లైన్‌ బిజినెస్ వెంచర్ ప్రారంభించారు. ఇది రెడీ టు ఈట్ ఫుడ్ బిజినెస్. కాగా ఇదే విషయాన్ని ఉపాసన స్వయంగా తెలిపారు. ఈ మేరకు ఒక వీడియోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది ఉపాసన. ఈ రోజు అత్తమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా మా వ్యవస్థాపక వెంచర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. సంప్రదాయానికి అనుగుణంగా రుచి ఉన్న వంటశాలలో బంధాలు తరతరాలుగా నిర్మించబడతాయి. ఇప్పుడు మా వంటగది నుంచి మీ వద్దకు రెడీ మిక్స్‌ రూపంలో కొన్ని ఆహార ప్రాడక్ట్స్‌ వస్తున్నాయి.

మీరు కూడా మీ ఇంట్లోనే వీటిని ఆస్వాదించండి అంటూ ఉపాసన రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రొడక్ట్స్‌ అన్నీ athammaskitchen.com అనే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి ఉప్మా, పొంగల్‌, పులిహార, రసం ఈ 4 ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఈ నాలుగు ప్యాకెట్ల ధర రూ. 1,099 ఉంది. ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించి వీటిని పొందవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా తమ ఆహార ఉత్పత్తులు అందుతాయని తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా ఉపాసన ఒక వీడియో విడుదల చేశారు.