Prathinidhi 2 : ప్రతినిధి 2 సినిమా చూసి.. ఓటు వెయ్యమంటున్న చంద్రబాబు..

ప్రతినిధి 2 సినిమా చూసి ఓటు వెయ్యమంటున్న చంద్రబాబు. ఓటు అనేది పెట్టుబడి లాంటిది..

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 10:51 AM IST

Prathinidhi 2 : నారా రోహిత్ చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు ప్రతినిధి 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ప్రతినిధి 1 సినిమా.. నారా రోహిత్ కెరీర్ లోనే గుర్తుండిపోయే చిత్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కించి ఎన్నికల సమయంలో ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.

తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ ని దర్శకుడు మూర్తి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి చూపించారు. ట్రైలర్ ని చూసిన చంద్రబాబు మాట్లాడుతూ.. “ఓటు అనేది పెట్టుబడి లాంటిది. దానిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మీ జీవితాన్నే మార్చేస్తుంది. కాబట్టి ఈ 13వ తారీఖున ఆ ఓటుని ఆలోచించి జాగ్రత్త ఉపయోగించుకోండి. అంతకముందు ప్రతినిధి 2 సినిమా కూడా చూసేయండి” అంటూ చెప్పుకొచ్చారు.

ప్రతినిధి 1 మంచి హిట్ అవ్వడంతో.. ఈ సీక్వెల్ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను మూవీ టీం అందుకుంటుందో లేదో చూడాలి. కాగా ట్రైలర్ చూస్తుంటే.. ఏపీ రాజకీయాల్లోనే కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న కొన్ని యదార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

మరి ఎన్నికలకు మూడు రోజుల ముందు వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగరం సంగీతం అందిస్తున్నారు.