బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హైదరాబాద్ లో మెరిసింది. నానక్రాంగూడ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్లో శుక్రవారం రాత్రి ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్లు అమిత్ అగర్వాల్, నూరు కరీం రూపొందించిన దుస్తుల్లో రూపదర్శినులు ర్యాంప్ వాక్ చేసి అలరించారు. ప్రముఖ సినీ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ర్యాంప్పై షో స్టాపర్గా తళుక్కుమన్నారు.
జాన్వీకపూర్ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. జాన్వీకపూర్ సినిమాల్లో ఎక్కువగా యాక్ట్ చేయకపోయినా సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్కి కూడా ఉండదు. అందుకే పొట్టి దుస్తులు వేసుకొని తన అంద, చందాలను, సొగసులను ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. అటు మీడియాను, ఇటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోనూ జాన్వీ ఇతర హీరోయిన్స్ కంటే ముందుంది. ఇక జాన్వీ ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.