Shivaji: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన శివాజీ.. దుబాయ్ లో అలా?

  • Written By:
  • Publish Date - March 8, 2024 / 10:30 AM IST

తెలుగు ప్రేక్షకులకు నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఇలా ఎన్నో రకాల పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శివాజీ. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు వరుసగా సినిమాలు చేసి నటుడిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత కాలంలో సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. సినిమాలకు దూరమైన శివాజీ ఆ తర్వాత రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు. తరచూ రాజకీయాల ద్వారా సోషల్ మీడియాలో నిలుస్తూ వచ్చారు. ఇకపోతే ఇటీవల తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి అడుగుపెట్టి టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే.

టైటిల్ గెలుస్తాడు అనుకున్న శివాజీ చివరికి మూడవ స్థానంలో నిలిచాడు. ఇటీవలే సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన శివాజీ వెబ్ సిరీస్ నైంటీస్ మిడిల్ క్లాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాకా శివాజీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. బిగ్ బాస్ షోతో శివాజీ శివన్నగా మారిపోయాడు. తాజాగా శివాజీ అలీతో సరదాగా షోకి హాజరయ్యాడు. అలీ తన స్టైల్ లో సరదాగా మాట్లాడుతూనే శివాజీకి పాత విషయాల్ని గుర్తు చేశాడు. నటనకి దూరంగా ఉన్నావు కదా, 90 స్ బయోపిక్ లో ఛాన్స్ ఎలా వచ్చింది అని అలీ ప్రశ్నించాడు.

దీనికి శివాజీ సరదాగా సమాధానం ఇచ్చాడు. నీకు పిల్లలు ఎంత మంది అని అడుగగా ఇద్దరు కొడుకులు అని శివాజీ బదులిచ్చాడు. కూతురు కూడా ఉన్నట్లు చెబుతున్నారు ఏంటి అని అడిగాడు. ఆ కూతురు ఎక్కడ ఉందో తెచ్చిపెట్టండి బంగారంలా చూసుకుంటాను అని నవ్వుతూ తెలిపాడు. మా నాన్న మమ్మల్ని పెంచడానికి చాలా కష్టపడుతుండేవాడు. వ్యవసారంలో ఏమీ మిగిలేది కాదు. అందుకే బాధ్యతలు నేను కూడా పంచుకోలేని హైదరాబాద్ వచ్చేశాను అంటూ తాను పడ్డ కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

అలాగే శివాజీ కెరీర్ లో ఒక వివాదాస్పద అంశాన్ని అలీ ఈ షోలో కెలికారు. నిన్ను ఎవరూ గుర్తు పట్టకూడదు ని మీసాలు తీసేసి తిరిగావు ఎందుకు అని అలీ ప్రశ్నించారు. పాత కాంట్రవర్సీకి అలీ మరోసారి కెలికాడు. శివాజీ సమాధానం ఇస్తూ వేషం మార్చి దుబాయ్ లో దొరికిపోయిన శివాజీ అంటూ వార్తల్లో నా గురించి వేశారు అని శివాజీ బాధపడ్డారు. అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే 2019లో అలంద మీడియా వివాదం చెలరేగింది. అందులో శివాజీ పేరు కూడా వచ్చింది. దీనితో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనితో దేశం విడిచి వెళ్ళకూడదు. కానీ శివాజీ మీసాలు తీసేసి అమెరికా వెళుతూ దుబాయ్ లో పట్టుబడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి శివాజీ ఖండించారు. తాను 50 కంటే ఎక్కువసార్లు అమెరికా వెళ్లి వచ్చానని ప్రతిసారి లీగల్ గానే వెళ్లానని శివాజీ తెలిపారు. మొత్తానికి తాజాగా ఈ విషయం మరోసారి స్పందించడంతో ఈ విషయం మరోసారి వైరల్ గా మారింది.