Pallavi Prashanth: ప్రాణం పోయిన కూడా ఇచ్చిన మాట తప్పను : పల్లవి ప్రశాంత్

  • Written By:
  • Publish Date - March 15, 2024 / 10:05 AM IST

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కామన్ మాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సీరియల్ నటుడు అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ టైటిల్ కోసం పోటీపడ్డారు. ప్రేక్షకుల ఓట్లతో పల్లవి ప్రశాంత్ టైటిల్ కైవశం చేసుకున్నాడు. అయితే విన్నర్ గా పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షల ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్ బహుమతులుగా అందుకున్న విషయం తెలిసిందే. టాస్క్స్, గేమ్స్ లో సత్తా చాటాడు. అలాగే రైతు బిడ్డ ట్యాగ్ కూడా అతనికి బాగా ఉపయోగపడింది.

కాగా ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు తాను టైటిల్ విన్నర్ అయితే ఆ డబ్బులు పేద రైతులకు పంచిపెడతాని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో వేదికగా ఈ మాట పలుమార్లు చెప్పాడు. అయితే బిగ్ బాస్ పూర్తయ్యి మూడు నెలలు కావస్తున్నా దాని పై ఇంతవరకు ఎలాంటి ఊసు లేదు. దాంతో పల్లవి ప్రశాంత్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రశాంత్ ను చాలా మంది ట్రోల్ చేశారు. ఇచ్చిన మాట మర్చిపోయి షోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడంటూ విమర్శలు చేశారు. మొత్తానికి ఇప్పటికి పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.

రైతులకు తాను అందిస్తానన్న సాయం అందించాడు. తాజాగా ప్రశాంత్ గజ్వేల్‪‌లోని కొలుగురూ గ్రామానికి చెందిన ఒక రైతు కుటుంబానికి సాయం అందించాడు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఇద్దరు పిల్లల కోసం రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు పల్లవి ప్రశాంత్. ప్రశాంత్ తో పాటు సందీప్ మాస్టర్ రూ.25 వేలు సాయం అందించారు. ఈ వార్తలపై నెటిజన్స్ స్పందిస్తూ హమ్మయ్య ఇన్నాళ్లకు ముహూర్తం వచ్చిందా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.