Bigg Boss 6: చేపల చెరువు టాస్క్.. కన్నీళ్లు పెట్టిన గలాటా గీతూ?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 షో కొట్లాటలు, గొడవలు,టాస్క్ లు, ఏడుపులతో సాగుతోంది. ఈ

  • Written By:
  • Updated On - October 26, 2022 / 04:53 PM IST

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 షో కొట్లాటలు, గొడవలు,టాస్క్ లు, ఏడుపులతో సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ మొదలయ్యింది. కాగా ఈ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లోని సభ్యులకు కెప్టెన్సీ రేస్ లో నిలిచేందుకు చేపల చెరువు అనే టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కోసం హౌస్ లో ఇద్దరిద్దరిని ఒక్కొక్క గ్రూపుగా డివైడ్ చేశాడు. ఇక ఏ జంట అయితే ఎక్కువగా చేపలను కలెక్ట్ చేస్తారో వాళ్లే గెలిచినట్టు.

ఏ జంట దగ్గర అయితే తక్కువ చేపలు ఉంటాయో ఆ జంట ఆ టాస్క్ నుంచి తప్పుకున్నట్లు అని తెలిపాడు బిగ్ బాస్. అయితే ఈ నేపథ్యంలోని టాస్క్ లో భాగంగా పక్కవారి దగ్గర ఉన్న చేపలను కూడా బలవంతంగా కొట్టుకొని ఒకరిపై ఒకరు పడుతూ లాక్కున్నారు కంటెస్టెంట్లు. ఈ నేపథ్యంలోనే టాస్క్ లో ఫిజికల్ గా గెలవలేని భావించిన గీతూ, ఆదిరెడ్డి ఆ మాటలతో ఆటలో చిచ్చుపెట్టాలని ప్లాన్ వేసింది. రేవంత్ ని మాటలతో రెచ్చగొట్టి ఆపితే ఇనయ ఎక్కువగా చేపలు ఏడలేదని ఆదిరెడ్డికి ప్లాన్ చెప్పింది గీతూ. కానీ ప్లాన్ మాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు.

చేపలు పడినప్పుడు కంటెస్టెంట్లు ఒకరిని మించి మరొకరు పోటీపడి మరీ చేపలను ఏరుకొన్నారు. ఈ నేపథ్యంలోనే మెరీనా, నా జోలికి రావద్దు అంటూ గీతూకి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ ఛాలెంజ్ లో ఫైమా, రాజ్ జంట విజేతగా నిలిచి పది చేపలను దక్కించుకున్నారు. ఇక టాస్క్ మొత్తం ముగిసిపోయేసరికి రేవంత్,ఇనయ జంట దగ్గర అత్యధికంగా చేపలు ఉన్నాయి. అయితే కెప్టెన్సీ పోటీ దాగిన టాస్క్ లో నుంచి తప్పుకోవడంతో గీతూ వెక్కివెక్కి ఏడ్చింది. టాస్క్ కోసమే అందర్నీ రెచ్చగొట్టానని హౌస్ మేట్స్ కి చెబుతూ ఎమోషనల్ అయింది. అలాగే టాస్క్ లో తన నెట్టేసిన రేవంత్ ని కాలితో తన్నడంతో పాటు బూతు పదాన్ని వాడాను అందుకు క్షమాపణ కోరుతున్నాను అని కూడా తెలిపింది గీతూ.