బాలయ్య – చిరు ఫేస్ టు ఫేస్.. ఎప్పుడు? ఎక్కడ?

ఇప్పుడు అంతా ఓటీలదే హవా నడుస్తోంది. డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ  దూసుకుపోతున్నాయి. యంగ్ స్టర్స్ కూడా చాలామంది ఓటీటీల్లోనే మునిగిపోతున్నారు.

  • Written By:
  • Updated On - October 14, 2021 / 11:42 AM IST

ఇప్పుడు అంతా ఓటీలదే హవా నడుస్తోంది. డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ  దూసుకుపోతున్నాయి. యంగ్ స్టర్స్ కూడా చాలామంది ఓటీటీల్లోనే మునిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలో అతిపెద్ద ఫ్లాట్ ఫామ్ అయినా ఆహా నుంచి ఓ సర్ ప్రైజ్ రాబోతోంది. త్వరలో నందమూరి హీరో బాలయ్య హోస్ట్ గా రంగంలోకి దిగనున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఇలాంటి ఒక షో ఒప్పుకోవడమే ఆశ్చర్యకరంగా మారితే, ఇందులో వచ్చే గెస్ట్ లు కూడా మరింత స్పెషల్ గా ఉంటారని సమాచారం.

మొదటిసారి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తుండటంతో టాక్ షోపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. గెస్టులుగా ప్రముఖ నటీనటులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ టాక్ షో భాగంగా బాలయ్యకు సన్నిహితుడైన మోహన్ బాబు, లేదంటే మంచు విష్ణు, మంచు మనోజ్ కనిపించనున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పెషల్ గెస్ట్ గా వస్తారట. కనుక నిజమైతే బాలయ్య, చిరు ఫేస్ టు ఫేస్ ప్రోగ్రాం అభిమానలకు పూనకాలు తెప్పించడం ఖాయమేనని ఫ్యాన్స్ అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవితో బాలకృష్ణ చిట్ చాట్ చేసే ఏపీసోడ్ కోసం నిర్మాత అల్లు అరవింద్ ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నాడు. అంతా సవ్యంగా జరిగితే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకే వేదికపై బాలయ్య, చిరు కనిపిస్తే టాక్ షో కు మరింత పేరు వస్తోంది.

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న అఖండ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపోందిస్తున్నారు బోయపాటి శ్రీను. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో జైబాలయ్య మూవీ కూడా ఆసక్తి రేపుతోంది.