Baahubali : కట్టప్ప విలన్‌గా బాహుబలి యానిమేషన్ సిరీస్.. ట్రైలర్ చూసారా..?

బాహుబలి యానిమేషన్ సిరీస్ ట్రైలర్ చూసారా..? కట్టప్ప విలన్‌గా మారితే బాహుబలి, భల్లాలదేవ కలిసి అతడి పై యుద్ధం చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 03:25 PM IST

Baahubali – Crown of Blood : ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్ వార్ యాక్షన్ డ్రామా మూవీ ‘బాహుబలి’. రెండు పార్టులుగా వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమాలకు కొనసాగింపుగా మరికొన్ని కథలు కూడా ఫ్రాంచైజ్ రూపంలో వస్తే బాగుండని ఆడియన్స్ ఎప్పటినుంచో ఫీల్ అవుతున్నారు.

ఆ మధ్య దర్శకుడు దేవ కట్టా డైరెక్షన్ లో బాహుబలి కథని వెబ్ సిరీస్ గా తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేసారు. కానీ ఆ ప్లాన్ ఎందుకో వర్క్ అవుట్ లేదు. తాజాగా బాహుబలి కథతో ఓ యానిమేషన్ సిరీస్ ని తీసుకు రాబోతున్నారు. ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ యానిమేషన్ సిరీస్ ని తెరకెక్కించిన మేకర్స్.. ఈ బాహుబలి సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఇటీవలే రాజమౌళి ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

ఈ ట్రైలర్ లో చూపించిన కథ ఏంటంటే.. బాహుబలి కాలకేయుడిని చంపిన తరువాత భల్లాలదేవ వెన్నుపోటుని ఎదుర్కొనే ముందు మరో యుద్ధం చేసాడు. ఆ యుద్ధంలో బాహుబలి రక్తదేవ్ అనే విలన్ ని ఎదుర్కోబోతున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బాహుబలి సేనాధిపతిగా ఉండాల్సిన కట్టప్ప.. విలన్ సైడ్ వెళ్లి, రక్తదేవ్ సేనకు అధిపతిగా మారి మాహిష్మతి పై యుద్దానికి వస్తాడు. ఇక ఈ యుద్ధంలో కట్టప్పని, రక్తదేవ్ ని గెలవడం కోసం బాహుబలి, భల్లలదేవ కలిసి ఫైట్ చేస్తారు.

ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. కట్టప్ప విలన్ సైడ్ వెళ్లడం కూడా బాహుబలి వేసిన ప్లాన్ అని తెలుస్తుంది. కాగా ఈ యుద్ధంలో మోడరన్ వెపన్ టెక్నాలజీ కూడా కనిపిస్తుంది. మరి ఈ యానిమేషన్ సిరీస్ తో ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. కాగా ఈ సిరీస్ ని మే 17 నుంచి హాట్ స్టార్ లో ప్రసారం కాబోతుంది.