Anushka Shetty: అనుష్క ఆ డైరెక్టర్ తో మరోసారి సినిమా చేయబోతోందా.. ఇందులో నిజమెంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్స్ లో అ

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 08:30 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్స్ లో అనుష్క కూడా ఒకరు. మొదట అనుష్క పూరి జగన్నథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది. ఇకపోతే బాహుబలి సినిమా తర్వాత అనుష్క చాలా వరకు సినిమాలు చేయడం తగ్గించేసింది. గత ఏడాది నవీన్ పొలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది.

కాగా ప్రస్తుతం అనుష్క అభిమానులు ఆమె సినిమాల కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుంది అనుష్క. టాలీవుడ్ దాదాపుగా అందరి సినిమాలలో నటించిన అనుష్క ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే తప్పకుండా అనుష్క ఉండాల్సిందే అన్న రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకుంది. కానీ బాహుబలి సినిమా దగ్గర నుంచి సినిమాల స్పీడ్ తగ్గించింది అనుష్క. ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం అనుష్క మరొక కొత్త మూవీకి సైన్ చేసిందట.

దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో అనుష్క ఒక భారీ పిరియాడికల్ మూవీ చేస్తోందట. అయితే గతంలో అనుష్క క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన వేదం సినిమాలో నటించింది. ఈ సినిమాలో వేశ్య పాత్రలోనూ అద్భుతంగా నటించింది. ఇప్పుడు మరోసారి ఈ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కానుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజానిజాల గురించి తెలియాల్సి ఉంది. అయితే అనుష్క రాను రాను సినిమాలకు చాలా గ్యాప్ ఇస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఆమె సినిమాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా
అనుష్క 40 ఏళ్ల వయసుకు చేరువ అవుతున్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న విషయం తెలిసిందే.