Karthikeya 2: కార్తికేయ 2 ప్రమోషన్స్ కు అందుకే రావడం లేదు.. క్లారిటీ ఇచ్చిన అనుపమ!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ 2. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న

  • Written By:
  • Publish Date - August 3, 2022 / 01:15 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ 2. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా 2014లో విడుదల బ్లాక్ బస్టర్ హీట్ ను అందుకున్న కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 12న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ గ్రామంలోనే చిత్ర బంధం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే.

అయితే చిత్రం బృందం అందరూ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అనుపమ మాత్రం పాల్గొనకపోవడంతో పలు రకాల అనుమానాలు తలెత్తున్నాయి. ఇది ఇలా ఉంటే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. షూటింగ్ 5 గంటలకు ఉన్న సరే టైం కి వచ్చేస్తుంది కానీ ప్రమోషన్స్ అంటే మాత్రం అనుపమ నుంచి మంచి రెస్పాన్స్ ఉండదు అని చెప్పుకొచ్చాడు నిఖిల్. తాజాగా ఈ విషయంపై స్పందించిన అనుపమ ఇంస్టాగ్రామ్ లో ఒక ట్వీట్ చేసింది. నేను కార్తికేయ సినిమా ప్రమోషన్ కి ఎందుకు రావడం లేదు అన్న విషయం పై క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను.

నేను రాత్రి పగలు రెండు సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నాను.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో కార్తికేయ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేక పోతున్నాను.. ఈ విషయంలో మీరు అందరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.. చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు..ముఖ్యంగా హీరో నిఖిల్ గారి ఎఫర్ట్స్ కి నా కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చింది అనుపమ. ఈ ట్వీట్ పై స్పందించిన పలువురు నెటిజెన్స్ పాజిటివ్ గా స్పందించగా, మరి కొంతమంది మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక నిఖిల్ నటించిన ఈ కార్తికేయ 2 సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.