ఎవరూ ఊహించని విధంగా జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే మాఎన్నికల ఫలితాలపై యాంకర్, నటి అనసూయ స్పందించింది. నిన్న రాత్ర గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటించారు? రాత్రికి రాత్రే ఏమైందబ్బా అంటూ అనసూయ ట్వీట్ చేసింది. ఎలక్షన్స్ రూల్స్కి భిన్నంగా బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ వరుస ట్వీట్లు చేసింది. కాగా నిన్న జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్రాజ్ ప్యానల్ నుంచి అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందంటూ గతరాత్రి వార్తలు వైరల్ అయ్యాయి.అయితే ఎన్నికల అధికారి రిలీజ్ చేసిన మా విజేతల జాబితాలో అనసూయ పేరు లేకపోవడంతో ఆమె షాక్కి గురయ్యింది.
అనసూయ భరద్వాజ్కు ఓ నెటిజన్ ప్రశ్న వేస్తూ.. నిన్న ఈసీ మెంబర్స్లో అనసూయకి ఎక్కువ మెజారిటీతో గెలిచారని అని రాశారు. ఈ రోజు రిజల్ట్ రివర్స్ అయిందని వేశారు అని అంటే.. అంటే మరి నిన్న ఎవరో ఎలక్షన్స్ రూల్స్కి భిన్నంగా బ్యాలెట్ పేపర్స్ని ఇంటికి కూడా తీసుకెళ్లారని గుసగుసలాడుతున్నారు. నేను ఈ విషయం బయటకు నేను అనట్లేదు అని మరో ట్వీట్ చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో వింత విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఓటేయడానికి ప్రముఖులెవరూ ముందుకు రావట్లేదు. సుమారు 900కు పైగా ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకూ 665 మాత్రమే పోలవ్వడం గమనార్హం. అయితే గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం కాస్త ఓటింగ్ శాతం మాత్రం పెరిగిందని చెప్పుకోవచ్చు.
😂 Kshaminchali.. okka vishayam gurtochi tega navvochestundi.. meeto panchukuntunna emanukovoddey..! Ninna “athadhika majority” “bhaari majority” to gelupu ani.. eeroju “lost” “otami” antunnaru.. raathriki raathri enjaruguntundabba🧐 🤔
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021