Anchor Rashmi: ఒక్క ఫోటో పెడితే చాలు సొల్లు కార్చుకుంటారు.. నెటిజెన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మి!

  • Written By:
  • Updated On - March 24, 2024 / 11:28 AM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలతో పాటు పలు పండుగ ఈవెంట్లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది. అలాగే యాంకర్ గా వ్యవహారిస్తూ బాగానే సంపాదిస్తోంది. అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ మెప్పిస్తోంది. సినిమాలు అనుకున్న విధంగా రష్మికి కలిసి రాకపోవడంతో బుల్లితెరకే పరిమితం అవుతోంది. ప్రస్తుతం ఒకవైపు బుల్లితెరపై షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటో షూట్స్ తో యువతకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ రష్మీ నెటిజెన్స్ పై తీవ్రస్థాయిలో మండిపడింది. అసలేం జరిగింది. రష్మీ నెటిజన్స్ పై ఎందుకు మండి పడింది అన్న విషయానికి వస్తే.. ఇటీవల జొమోటో గ్రీన్ డ్రెస్ మీద స్పందిస్తూ రష్మిక ఒక పోస్ట్ చేసింది. వెజిటేరియన్ కి గ్రీన్ డ్రెస్ పెడితే, సపరేట్ ఆప్షన్ పెడితే తప్పేంటి అంటూ జొమోటో నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేయడంతో ఒక నెటిజన్.. ఇలాంటి పోస్టులన్నీ రీచ్ కోసమే, అటెన్షన్ కోసం కదా అంటూ రిప్లై ఇచ్చాడు. దానికి యాంకర్ రష్మీ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది.

 

రష్మీ రిప్లై ఇస్తూ.. రీచ్ కోసమైతే నేను ఇలాంటి విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోటో చాలు జూమ్ చేసీ మరీ సొల్లు కారుస్తూ అవసరం లేని అటెన్షన్ ఇస్తారు. నాకు తెలిసి నీకైతే అటెన్షన్ దొరికింది అనుకుంట కదా. ఈ అటెన్షన్ కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురుచూసావో అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. దీంతో రష్మీ ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది. ఆ నెటిజన్ కి గట్టి కౌంటర్ పడింది అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు రష్మి కి మద్దతుగా కామెంట్స్ చేస్తూ కరెక్ట్ గా సమాదానం చెప్పారు మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.