Virupaksha : ‘విరూపాక్ష’ సినిమా బిగ్‌బాస్ నటుడితో చేయాల్సింది.. కానీ సాయి దుర్గ తేజ్..

సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అండ్ కెరీర్ బెస్ట్ గా నిలిచిన 'విరూపాక్ష' సినిమా బిగ్‌బాస్ నటుడితో చేయాల్సింది. కానీ..

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 08:30 PM IST

Virupaksha : మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటించిన మిస్టిక్ థ్రిల్లర్ మూవీ ‘విరూపాక్ష’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాయగా, ఆయన శిష్యుడు కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేసారు. చేతబడులు నేపథ్యంతో 2023లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అండ్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 90 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసింది.

అయితే ఈ మూవీ సాయి దుర్గ తేజ్ చేయాల్సింది కాదట. ఈ సినిమాని ముందుగా బిగ్‌బాస్ నటుడితో ప్లాన్ చేశారట. దాదాపు రెండేళ్లు ఆ సినిమా కోసం వర్క్ చేశారట. కానీ చివరికి అది సాయి దుర్గ తేజ్ వద్దకి వచ్చింది. అసలు ఏమైంది..? ఇంతకీ ఆ బిగ్‌బాస్ నటుడు ఎవరు..? ఎందుకని ఆ స్క్రిప్ట్ సాయి దుర్గ తేజ్ వద్దకి వెళ్ళింది..? ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో ఆ బిగ్‌బాస్ నటుడి చెప్పుకొచ్చారు.

తెలుగు టీవీ సీరియల్స్ తో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న విజయవాడ కుర్రాడు ‘అర్జున్ అంబటి’. ఆ తరువాత బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి, అక్కడ చివరి వరకు వచ్చి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. అయితే బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే అర్జున్.. విరూపాక్ష ఆఫర్ ని అందుకున్నారు. దర్శకుడు కార్తీక్ వర్మ మొదటిగా ఆ కథని అర్జున్‌కే వినిపించారట.

అప్పుడు ఆ సినిమా టైటిల్ ‘శాసనం’ అంట. ఆ మూవీని తెరకెక్కించడం కోసం ఆల్మోస్ట్ రెండేళ్ల పాటు నిర్మాతలు కోసం తిరిగారట. అయితే అర్జున్ కొత్తవాడు అవ్వడంతో నిర్మాతలు ప్రొడ్యూస్ చేయడానికి అలోచించి వెనకడుగు వేస్తూ వచ్చారట. దీంతో చేసేది లేక అర్జున్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో.. అది సాయి దుర్గ తేజ్ వద్దకి చేరింది. ఇక ఆ చిత్రం పెద్ద హిట్ అవ్వడమే కాదు, సీక్వెల్ పై కూడా ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది. మరి ఆ సీక్వెల్ ఎప్పుడు వస్తుందో చూడాలి.