Allu : సమంతకు ‘స్పెషల్’ థ్యాంక్స్ చెప్పిన బన్నీ!

టాలీవుడ్ బ్యూటీ సమంత క్రేజ్ మాములుగా ఉండదు. తన క్యూట్ నెస్ తో,  మెస్మరైజ్ నటనతో ఎక్కడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. మరి అలాంటి బ్యూటీ తొలిసారిగా ఐటం సాంగ్ చేస్తే..

  • Written By:
  • Updated On - December 13, 2021 / 03:30 PM IST

టాలీవుడ్ బ్యూటీ సమంత క్రేజ్ మాములుగా ఉండదు. తన క్యూట్ నెస్ తో,  మెస్మరైజ్ నటనతో ఎక్కడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. మరి అలాంటి బ్యూటీ తొలిసారిగా ఐటం సాంగ్ చేస్తే.. కెవ్వు కేక అనాల్సిందే మరి. అంచనాలకు తగ్గట్టే సమంత స్పెషల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఊఅంటావా.. ఊఊ అంటావా మావ.. అంటూ కుర్రకారును మనసులను కొల్లగొడుతోంది. అయితే సమంత డాన్స్ కు బన్నీ సైతం ఫిదా అయ్యాడు.

కేవలం 5 రోజులు మిగిలి ఉన్నందున అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప: ది రైజ్ నిర్మాతలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప్రమోట్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. పుష్ప మొదటి భాగం డిసెంబర్ 17న విడుదలవుతుండగా, దానికి ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు ఎస్‌ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దర్శకుడు సుకుమార్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ “ఈ ఈవెంట్‌కు సుకుమార్ హాజరు కాలేడని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. నేను అతనితో మాట్లాడినప్పుడు మూవీకి సంబంధించిన వర్క్ లో బిజీగా ఉన్నాడు. అతని కమిట్‌మెంట్‌కి తగ్గట్టు హ్యాట్సాఫ్’’ అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రతిపాట బాగుందనీ, ముఖ్యంగా సమంత ఐటం సాంగ్ చాలా బాగా వచ్చిందని అన్నారు. ఎలాంటి కండీషన్లు పెట్టకుండా పాట కోసం ఎంత చేయాలో అంత చేసిందని, అందుకే సమంత కు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేననన్నారు. హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్ లో జరిగిన పుష్ప ఈవెంట్ కు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై బన్నీ.. జైజై బన్నీ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి, కొరటాల శివ, రష్మిక, అనుసూయ, సునీల్, అల్లు అరవింద్, సిధ్ శ్రీరాం తదితరులు హాజరయ్యారు.