Allu Arjun: బిజినెస్ రంగంలో తగ్గేదేలే అంటున్న బన్నీ.. ఆంధ్రాలో మల్టీప్లెక్స్ కీ ప్లాన్!

  • Written By:
  • Updated On - March 19, 2024 / 09:31 AM IST

ప్రస్తుతం చాలామంది టాలీవుడ్ హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రధానంగా మహేష్ బాబు,అల్లు అర్జున్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇంకా చాలా మంది టాలీవుడ్ హీరోలు బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. బిజినెస్ లోనూ అదరగొడుతూ వ్యాపారాల్లో కోట్లు ఆర్జిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమలో థియేటర్ బిజినెస్ బాగా ఊపందుకుంది. స్టార్ హీరోలు సైతం ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు నగరంలో మల్లీప్లెక్స్ థియేటర్లను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కు AAA, మహేశ్ బాబుకు AMB, అలాగే విజయ్ దేవరకొండ కు VD పేరుతో హైదరాబాద్ నగరంలో మల్లీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. త్వరలోనే మాస్ మహరాజా ర‌వితేజ కూడా మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నారు. ఏషియన్ సంస్థతో కలిసి ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో AAA పేరుతో మల్లీప్లెక్స్ థియేటర్ నిర్వహిస్తోన్న అల్లు అర్జున్ ఇప్పుడు తన బిజినెస్ ను మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారట.

అయితే ఇప్పుడు తెలంగాణ‌లో కాదు ఏపీలో కూడా. అవును విశాఖ పట్నంలో అర్జున్ AAA మల్టీప్లెక్స్ కు ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం వైజాగ్‌లో కొత్తగా కడుతున్న ఇనార్బిట్ మాల్‌లో ఆసియన్ సంస్థతో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లే మల్టీప్లెక్స్ థియేటర్ ను ఏర్పాటుచేస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. అలా అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ రంగంలో రాణిస్తూ తగ్గేదేలే అంటూ తీసుకుపోతున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజిబిజీగా ఉంటున్నాడు అల్లు అర్జున్. గతంలో రిలీజై పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప2 సినిమా రిలీజ్ కానుంది.