Allu Arjun: అమీర్ పేటలో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ మొదలు.. ఎప్పుడో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న విషయం

  • Written By:
  • Publish Date - December 8, 2022 / 08:12 PM IST

సినీ ఇండస్ట్రీలో హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమాలలో హీరోగా నటిస్తూ వచ్చే లాభాలను బిజినెస్లలో పెట్టుబడులుగా పెడుతూ రాణిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఈ విధంగా బిజినెస్ ను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో మరొక పాన్ ఇండియా హీరో కూడా రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్. టాలీవుడ్ లో మహేష్ బాబు విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఏసియన్ సంస్థతో కలిసి మల్టీప్లెక్స్ లోను భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ కూడా వీరి బాటలోనే నడవబోతున్నారు. కాగా ఇప్పటికే ఏసియన్ తో కలిసి నిర్మించిన మల్టీ ప్లెక్స్ కూడా ఓపెనింగ్ కు రెడీగా ఉంది.మల్టీప్లెక్స్ నిర్మాణంలో దూసుకెళ్తున్న ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏఏఏ సినిమాస్ అనగా ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ ను స్టార్ట్ చేయబోతున్నాడు అల్లు అర్జున్. అమీర్ పేట్ సత్యం థియేటర్‌ ప్లేస్ లో భారీ మల్టీ ప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఇక త్వరలో ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కూడా కానుంది. మల్టీప్లెక్స్ ను అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఏషియన్ సత్యం మాల్ మల్టీప్లెక్స్ నిర్మాణం రీసెంట్ గా పూర్తయింది. మల్టీ ప్లక్స్ ను జనవరిలో ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇకపోతే అల్లు అర్జున్ విషయానికి వస్తే.. గత ఏడాది విడుదల అయినా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో ఊహించని విధంగా భారీగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నాడు అల్లు అర్జున్. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగు మొదలుపెట్టే పనిలో ఉన్నారు. అయితే పుష్ప పార్ట్ 1 సినిమా విడుదల అయ్యి ఏడాది పూర్తి కావస్తున్న ఇంకా పుష్ప పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ మొదలు కాకపోవడంతో అభిమానులను నిరాశ వ్యక్తం చేస్తున్నారు.