Allari Naresh : రైటర్ గా మారిన అల్లరి నరేష్

సుడిగాడు 2 సీక్వెల్ రాబోతుందని తెలిపి అభిమానుల్లో సంతోషం నింపారు

  • Written By:
  • Publish Date - April 23, 2024 / 12:22 PM IST

‘అల్లరి’ సినిమాతో నరేష్ కాస్త అల్లరి నరేష్ (Allari Naresh ) గా మారాడు. రాజేంద్రప్రసాద్ తర్వాత తెలుగు లో అంతటి కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న నరేష్ కు ఇటీవల ఏమాత్రం కలిసిరావడం లేదు. ముఖ్యంగా కామెడీ సినిమాలు ఒక్కటంటే ఒక్కటి విజయం సాధించలేకపోయాయి. సుడిగాడు తర్వాత ఎన్నో కామెడీ సినిమాలు చేసిన ఒక్కటి కూడా సక్సెస్ సాదించకపోయేసరికి …సీరియస్ క్యారెక్టర్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే చాల గ్యాప్ తర్వాత ‘ఆ ఒక్కటి అడక్కు’ (Aa Okkati Adakku) అంటూ కామెడీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

నూతన దర్శకుడు మల్లి అంకం తెరకెక్కించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను వేసవి కానుకగా మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు. ట్రైలర్ విడుదల సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. సుడిగాడు 2 (Sudigadu 2) సీక్వెల్ రాబోతుందని తెలిపి అభిమానుల్లో సంతోషం నింపారు. ‘నా కెరీర్‌లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ అయిన సుడిగాడు సినిమాకు సీక్వెల్ తీసుకొస్తాం. సుడిగాడు 2 కథ నేనే రాస్తున్నాను. ప్రస్తుతం పార్ట్ 2కు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేస్తాం’ అని అల్లరి నరేష్ తెలిపాడు.

2012 లో భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన సుడిగాడు సినిమా నరేష్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను రూ.7 కోట్లు పెట్టి తీస్తే.. ఏకంగా రూ.32 కోట్లు వసూలు చేసింది. అలాంటి ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ రాబోతుండడం..అది కూడా నరేష్ స్క్రిప్ట్ రాస్తుండడం తో సినిమా ఫై బజ్ నెలకొంది.

Read Also : Tekkali : ఊపిరి పీల్చుకున్న దువ్వాడ శ్రీనివాస్..బరిలో నుండి తప్పుకున్న దువ్వాడ వాణి