Samantha: సమంత ఈజ్ బ్యాక్.. అదిరిపొయే ఐటం సాంగ్ షురూ!

నాగ చైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన సమంత వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకుసాగుతోంది. బ్యాక్-టు-బ్యాక్ సినిమాలకు సైన్ చేయడం నుంచి వరుసగా విహార యాత్రలకు చేస్తూ కొత్త ప్రపంచంలోకి వెళ్తే ప్రయత్నం చేస్తోంది.

  • Written By:
  • Updated On - November 29, 2021 / 05:39 PM IST

నాగ చైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన సమంత వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకుసాగుతోంది. బ్యాక్-టు-బ్యాక్ సినిమాలకు సైన్ చేయడం నుంచి వరుసగా విహార యాత్రలకు చేస్తూ కొత్త ప్రపంచంలోకి వెళ్తే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం సమంత మొదటగా ఐటెమ్ సాంగ్ షూటింగ్ ప్రారంభించింది. అల్లు అర్జున్ ‘పుష్ప’లో ఓ పాట చేస్తోంది. దరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 17న థియేటర్లలోకి రానుంది. సుక్కు, దేవి కాంబినేషన్ లో ఇప్పటికే ఎన్నో ఐటం సాంగ్స్ హుషారెత్తించాయి. రంగస్థలం మూవీలో పూజహెగ్డే నటించిన జిల్ జిల్ జిగేల్ రాజా… అనే పాట ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పుష్పతో మూవీలో అదిరిపొయే ఐటం సాంగ్ ఉంటుందని, ఆ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాలీవుడ్ టాక్. మరి అలాంటి పాటలో సమంత ఎంతవరకు ఆకట్టుకుందో చూడాలి మరి.

అక్టోబర్ 2న సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. విబేధాల కారణంగా నాలుగేళ్ల వివాహానికి తెరపడింది. విడాకుల వెనుక ఉన్న ప్రధాన కారణాలలో నాగ చైతన్య ఆమెపై కఠినమైన నిబంధనలను విధించాడని నివేదికలు సూచించాయి. అయితే, తమ విడాకుల వెనుక వివరాలను సమంతకానీ, చైతూకానీ బయటకు చెప్పలేదు.

నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత కొన్ని నెలల పాటు పనికి విరామం తీసుకుంది. సమంత తిరిగి సెట్స్ లోకి అడుగుపెట్టనుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ వేసి షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ పాటను ఐదు రోజుల పాటు చిత్రీకరించనున్నట్టు సమాచారం. పెప్పీ సాంగ్‌కి దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచారు. సమంతపై వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అబార్షన్లు ఉన్నాయని పలు యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఆరోపణలు వచ్చాయి. పుకార్లను కొట్టిపారేస్తూ సమంత కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.