Shruti Haasan: ఆ హీరోయిన్స్‌తో నన్ను పోల్చకండి.. హీరోయిన్ శ్రుతిహాసన్ కామెంట్స్ వైరల్?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శృతి హాసన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకు

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 12:56 PM IST

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శృతి హాసన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలు కూడా వరుసగా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. గత ఏడాది బాల‌కృష్ఱ‌, చిరంజీవి సినిమాల‌తో ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు మ‌ళ్లీ నాని హీరోగా వ‌చ్చిన‌ హ‌య్ నాన్న, ప్ర‌భాస్ స‌లార్ సినిమాల‌లోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాల‌న్నీ ఒక‌దాన్ని మించి మ‌రోటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలిచి శృతి కేరీర్‌ లోనే హ్యాట్రిక్ విజ‌యాలు అందించాయి.

దీంతో ఈమెకు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శృతి హాసన్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను పాన్ ఇండియా స్టార్ గా పిలవడం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది శ్రుతిహాసన్. తాజాగా శ్రుతిహాసన్ ఒక ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఎప్పుడు పాన్ ఇండియా స్టార్ కాదు. పదకొండేళ్ల క్రితమే పాన్‌ ఇండియా స్టార్‌ని అని తెలిపింది శ్రుతిహాసన్. నేను 2009లో బాలీవుడ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. అప్పుడు సోషల్ మీడియా పెద్దగా వాడకంలో లేదు. అప్పుడు ఓటీటీలు కూడా లేవు.

ఉండుంటే నాకు ఇంకా మంచి పేరు వచ్చేది. నటిగా నా టాలెంట్ ఎక్కువ మంది చూసేవారు. అయినా పర్లేదు. అప్పటి పరిస్థితుల పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను అని తెలిపింది శ్రుతిహాసన్. పదకొండేళ్ల క్రితమే నేను పాన్‌ ఇండియా స్టార్‌ని.. అప్పుడు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే మీకు అర్ధమవుతుంది. అప్పుడే నేను పాన్ ఇండియా అనే పదాన్ని వాడాను. నాకు పాన్ ఇండియా పై ఇంట్రెస్ట్ లేదు. అన్ని భాషల్లో సినిమాలు చేశాను. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పుకుంటున్న హీరోయిన్స్ తో నన్ను పోల్చకండి. కొన్నేళ్ల క్రితమే నేను పాన్ ఇండియా సినిమాలు చేశాను. నేను డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాను నన్ను ఎవరితోనైనా పోల్చితే నాకు నచ్చదు అని చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్. ఈ సందర్భంగా శృతిహాసన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.