Sapthagiri : తాజాగా సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కమెడియన్, హీరో సప్తగిరి తల్లి మరణించారు. సప్తగిరి తల్లి నిన్న రాత్రి పలు ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. నేడు తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయం సప్తగిరి అధికారికంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మిస్ యు అమ్మ అంటూ తన తల్లి ఫోటో షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపారు సప్తగిరి.
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన సప్తగిరి పరుగు సినిమాతో కమెడియన్ గా మారారు. ఆ తర్వాత కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం పెళ్లి కానీ ప్రసాద్ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు.
Miss You Amma🙏. Rest In Peace
Death:: 04/08/2025
Funeral On 9th April in Tirupati pic.twitter.com/jBY0JKnnbv— Sapthagiri (@MeSapthagiri) April 8, 2025
సప్తగిరి తల్లి మరణించడంతో పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
Also Read : Mark Shankar : మార్క్ శంకర్ క్షేమం..అరా తీసిన వారికీ కృతజ్ఞతలు – పవన్