Radhika Apte: రాధికా ఆప్టే (Radhika Apte) బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లలో తన నటనతో ప్రజలను ఆకట్టుకుంది. ఈరోజు నటికి మంచి పేరు వచ్చింది. ఆమె బోల్డ్ పాత్రలకు, అలాగే ఆమె బోల్డ్ స్టేట్మెంట్లకు ప్రసిద్ది చెందింది. ఈసారి నటి ఏ సినిమా లేదా సిరీస్ కోసం కాకుండా ఇతర కారణాల వల్ల వార్తల్లోకి వచ్చింది. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇండిగో విమానంలో భువనేశ్వర్ వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయారు. ఏరోబ్రిడ్జ్పై ఇరుక్కుపోయిన ప్రయాణికుల్లో ప్రముఖ నటి రాధికా ఆప్టే కూడా ఉన్నారు. ఈ ఘటనపై ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించారు.
Also Read: Bhogi : భోగిని ఎందుకు జరుపుకుంటాం..? దానివెనుక ఉన్న పురాణ కథలు తెలుసా?
‘‘నేను ఇది పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఉదయం (శనివారం) 8.30 గంటలకు నేను ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. ఇప్పుడు 10.50 గంటలు అవుతున్నా ఇంకా విమానం ఎక్కలేదు. కానీ మేము ఫ్లైట్ ఎక్కబోతున్నామని సిబ్బంది చెబుతున్నారు. ప్రయాణికులు అందరినీ ఏరోబ్రిడ్జి ఎక్కించి లాక్ చేశారు’’ అని రాధికా ఆప్టే పేర్కొన్నారు. సెక్యూరిటీ సిబ్బంది తలుపులు తెరవలేదని, విమానం రాకపై సిబ్బందికి ఖచ్చితంగా సమాచారం లేదని పోస్టులో తెలిపారు. ‘‘ సిబ్బంది విమానం ఎక్కలేదు. తదుపరి డ్యూటీకి వచ్చే సిబ్బంది కోసం ఎదురుచూస్తున్నారు. నేను లోపల లాక్ అయ్యాను. మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడే ఉంటామని మాకు చెప్పారు. నీరు లేదు. మరుగుదొడ్డి లేదు. ఇలాంటి ప్రయాణానికి ధన్యవాదాలు’’ అని రాధికా ఆప్టే ఇన్స్టా పోస్టులో రాసుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
రాధికా ఆప్టే ఒక వీడియోను షేర్ చేసింది. అందులో చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు ప్రయాణికులు ఏరోబ్రిడ్జి వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడుతూ కనిపించారు. తాళం వేసి ఉండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం రాధికా ఆప్టే హిందీ సినిమాలతో బిజీగా ఉంది. పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది.