మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు అఖిల్ విశ్వనాథ్ (30) కన్నుమూశారు. ఇంట్లో తల్లి చూసేసరికి అఖిల్ శవమై కనిపించడం కలచివేసింది. ఈ ఘటన ఆత్మహత్య అయి ఉండవచ్చని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని అకాల మరణం మలయాళ సినీ వర్గాలను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అఖిల్ మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కార్ల కలెక్షన్ ఇదే!
అఖిల్ విశ్వనాథ్ కేవలం నటుడిగానే కాకుండా టెక్నీషియన్గా కూడా పనిచేశారు. కొన్నాళ్ల క్రితం వరకు ఆయన మొబైల్ షాపులో టెక్నీషియన్గా పనిచేసేవారు, అయితే గత కొంతకాలంగా ఆయన ఆ పనికి కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని సమాచారం. మరోవైపు, అఖిల్ తండ్రి బైక్ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కుటుంబ కష్టాల మధ్య అఖిల్ మరణించడం మరింత బాధాకరం.
సినీ పరిశ్రమలో అఖిల్ విశ్వనాథ్ తన నటనతో మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘చోళ’ (Chola) చిత్రానికి 2019లో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు (Kerala State Award) లభించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం మలయాళీ ప్రేక్షక లోకాన్ని కలచివేస్తోంది. ఆయన మృతిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
