Site icon HashtagU Telugu

Reshma Kewalramani: టైమ్ మ్యాగ‌జైన్ చోటు ద‌క్కించుకున్న భార‌తీయ సంత‌తికి చెందిన మ‌హిళ‌.. ఎవ‌రీ రేష్మా కేవ‌ల్ర‌మ‌ణి?

Reshma Kewalramani

Reshma Kewalramani

Reshma Kewalramani: టైమ్ మ్యాగజైన్ 2025లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారతీయ సంతతికి చెందిన రేష్మా కేవల్రమణి (Reshma Kewalramani) కూడా ఉన్నారు. రేష్మా అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ CEO. ఈ ఏడాది ఈ జాబితాలో చేరిన ఏకైక భారతీయురాలు ఆమె.

రేష్మా కేవల్రమణి ఎవరు?

ముంబైలో జన్మించిన రేష్మా 11 సంవత్సరాల వయస్సులో తన కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఆమె బోస్టన్‌లో నివసిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కవల సంతానం ఉన్నారు. 1998లో రేష్మా బోస్టన్ యూనివర్శిటీ నుండి లిబరల్ ఆర్ట్స్/మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమెకు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో ఫెలోషిప్ లభించింది.

2015లో ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి జనరల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందారు. వైద్యురాలిగా, ఆమె మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, బ్రిగామ్ అండ్ విమెన్స్ హాస్పిటల్, మసాచుసెట్స్ ఐ అండ్ ఇయర్ ఇన్ఫర్మరీ, MIT వంటి ప్రముఖ ఆసుపత్రుల్లో పనిచేశారు. ఆ తర్వాత ఆమె బయోఫార్మా రంగంలోకి ప్రవేశించి, అమజాన్‌లో 12 సంవత్సరాలకు పైగా పనిచేశారు.

2017లో వెర్టెక్స్‌లో చేరారు

2017లో రేష్మా వెర్టెక్స్‌లో చేరారు. 2018లో ఆమె కంపెనీ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. 2020లో కంపెనీ ఆమెను CEOగా నియమించింది. ప్రస్తుతం ఆమె వెర్టెక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో కూడా సభ్యురాలు. రేష్మా నాయకత్వంలో కంపెనీ విజయాలు సాధించింది. కంపెనీ రెండు కొత్త చికిత్సలను అభివృద్ధి చేసింది. వీటిలో ట్రిఫాక్టా కూడా ఉంది. ఇది సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే తీవ్రమైన జన్యు వ్యాధికి చికిత్స చేస్తుంది. అలాగే కంపెనీ VX-147ను అభివృద్ధి చేసింది. ఇది ప్రస్తుతం పరీక్షా దశలో ఉంది. ఈ ఔషధం ఒక రకమైన కిడ్నీ వ్యాధికి ఉపయోగపడుతుంది. అమెరికా ఔషధ ఏజెన్సీ FDA మొదటిసారిగా కంపెనీ CRISPR టెక్నాలజీ ఆధారిత ఒక థెరపీకి ఆమోదం తెలిపింది. ఇది ‘సికిల్ సెల్’ అనే తీవ్రమైన వ్యాధికి చికిత్స చేస్తుంది.

Also Read: Oil Pulling : ఉదయాన్నే నోటిని ఆయిల్తో పుక్కిలిస్తే కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..?

జాబితాలో ఇతరులు

టైమ్ 2025 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో 32 దేశాల నుండి వ్యక్తులను చేర్చింది. వీరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మార్క్ జుకర్‌బర్గ్, ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ముహమ్మద్ యూనస్ వంటి అనేక మంది ఉన్నారు.