Utility Bills Payment: యెస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ల ద్వారా యుటిలిటీ చెల్లింపులు (Utility Bills Payment) చేయడానికి ఛార్జీలను మార్చాయి. ఈ పరిస్థితిలో ఆయా బ్యాంకుల వినియోగదారుల విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఇతర యుటిలిటీ చెల్లింపులు చేస్తే ఇకపై ఎక్కువ ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. ఇది నేటి నుండి అంటే మే 1 నుండి ప్రారంభమైంది.
యెస్ బ్యాంక్ ఎంత వసూలు చేస్తుంది?
యెస్ బ్యాంక్ ప్రకారం.. రూ. 15,000 కంటే ఎక్కువ యుటిలిటీ చెల్లింపులపై 1 శాతం అదనపు ఛార్జీ విధించబడుతుంది. అంటే మీరు యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి మీ కరెంటు బిల్లును చెల్లిస్తే అది రూ. 15,000 అయితే మీరు దానిపై ఒక శాతం లేదా రూ. 15 అదనపు ఛార్జీని చెల్లించాలి.
IDFC ఫస్ట్ బ్యాంక్ కూడా అదనంగా వసూలు చేస్తుంది
యెస్ బ్యాంక్తో పాటు IDFC ఫస్ట్ బ్యాంక్ కూడా ఈ నిబంధనలో పెద్ద మార్పు చేసింది. IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 20 వేల కంటే ఎక్కువ యుటిలిటీ చెల్లింపుపై, మీరు 1 శాతం అదనపు ఛార్జీ, 18 శాతం GST చెల్లించాలి. దీనర్థం యెస్ బ్యాంక్ కస్టమర్లకు రూ. 15,000 వరకు ఉచిత వినియోగ పరిమితి ఉంటుంది. అయితే IDFC బ్యాంక్ విషయంలో ఈ మొత్తం రూ. 20,000. మీకు యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే స్టేట్మెంట్ సైకిల్లో రూ. 15,000 కంటే తక్కువ యుటిలిటీ బిల్లు చెల్లింపులకు మీరు ఎలాంటి అదనపు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదే నియమం IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి వర్తిస్తుంది. అయితే ఇందులో ఉచిత వినియోగ పరిమితి రూ.20 వేలు.
We’re now on WhatsApp : Click to Join
ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు..?
నివేదికల ప్రకారం.. వినియోగదారులు వ్యక్తిగత కార్డులను దుర్వినియోగం చేయడం, తక్కువ MDR కారణంగా ఈ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. MDR పూర్తి పేరు మర్చంట్ డిస్కౌంట్ రేట్ అని మనకు తెలిసిందే. ఇది ప్రతి క్రెడిట్ కార్డ్ లావాదేవీకి కంపెనీల నుండి చెల్లింపు గేట్వేలు వసూలు చేసే రుసుము.