Income Tax Bill 2025: కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభలో పాత ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును (Income Tax Bill 2025) ఉపసంహరించుకుంది. దీని స్థానంలో ప్రభుత్వం ఇప్పుడు కొత్త బిల్లును తీసుకురానుంది. ఈ బిల్లును 2025 ఫిబ్రవరిలో లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత దీనిని పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి పంపించారు. కమిటీ అన్ని సూచనలను పరిశీలించిన తర్వాత ఇప్పుడు కొత్త బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త బిల్లు ముఖ్య వివరాలు
తేదీ: కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం 2025 ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టింది.
కమిటీ నివేదిక: సెలెక్ట్ కమిటీ ఈ బిల్లుపై తన నివేదికను 2025 జులై 22న పార్లమెంట్కు సమర్పించింది.
ఉపసంహరణకు కారణం: బిహార్లో ఓటరు జాబితా ప్రత్యేక పునర్విమర్శ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాత బిల్లును ఉపసంహరించుకున్నారు.
కొత్త బిల్లు ఆమోదం: కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు నవీకరించిన సంస్కరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు 2025 ఆగస్టు 11న లోక్సభలో ప్రవేశపెట్టబడనుంది.
పాత చట్టం స్థానంలో: ఈ కొత్త బిల్లు ఆరు దశాబ్దాల పాత ఆదాయపు పన్ను చట్టం, 1961 స్థానంలో వస్తుంది.
సవరణలు: బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ ఈ బిల్లును సమీక్షించి, పలు సవరణలను సూచించింది.
Also Read: Kantara Actor: కన్నడ పరిశ్రమలో విషాదం.. కాంతార నటుడు కన్నుమూత!
కొత్త బిల్లులో మార్పులు.. పన్ను శ్లాబ్లపై స్పష్టత
కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు సంబంధించి ప్రజల్లో ఉన్న అతిపెద్ద ప్రశ్న పన్ను శ్లాబ్ల గురించి. అయితే ఆదాయపు పన్ను శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. కొత్త బిల్లులో పన్ను శ్లాబ్లలో ఎలాంటి మార్పుల ప్రతిపాదన లేదని పేర్కొంది. కొత్త బిల్లు ప్రధాన ఉద్దేశం చట్టంలోని భాషను సరళీకరించడం, అనవసరమైన నిబంధనలను తొలగించడం మాత్రమే అని తెలిపింది.
సెలెక్ట్ కమిటీ సూచనలు
సెలెక్ట్ కమిటీ చేసిన ముఖ్యమైన సూచనల్లో ఒకటి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేది. దీని ప్రకారం ట్యాక్స్పేయర్లు ఐటీఆర్ (ITR) దాఖలు చేసే చివరి తేదీ తర్వాత కూడా ఎలాంటి జరిమానా లేకుండా టీడీఎస్ (TDS) రీఫండ్ను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ సవరణ కొత్త బిల్లులో చేర్చబడే అవకాశం ఉంది.