భారతదేశపు అగ్రశ్రేణి ఆన్-డిమాండ్ కన్వీనియన్స్ ప్లాట్ఫారమ్ ‘స్విగ్గీ’, దేశ రాజధాని న్యూఢిల్లీలో ‘షి ద ఛేంజ్’ 2026 వేడుకలను ఘనంగా నిర్వహించింది. ‘ఫ్రమ్ విజన్ టు వెంచర్’ అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో, భారతదేశపు ఆహార మరియు ఆతిథ్య రంగ రూపురేఖలను మార్చిన 28 మంది మహిళా షెఫ్లను, రెస్టారెంట్ యజమానులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మాజేటితో కలిసి ఆయన విజేతలకు అవార్డులను అందజేశారు. ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన ‘వైబ్రాంట్ లివింగ్’ సంస్థాపకురాలు శ్రీదేవి జాస్తి ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకోవడం విశేషం. శాకాహార పోషక విలువలు, పరిశుభ్రమైన ఆహారపు అలవాట్లను ఒక స్థిరమైన జీవనశైలిగా మార్చడంలో ఆమె చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది.
ఆహార రంగంలో మహిళా సాధికారతకు స్విగ్గీ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది. ప్రస్తుతం స్విగ్గీ ప్లాట్ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 70,000 మహిళా రెస్టారెంట్ యజమానులు తమ వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సంస్థ అంచనాల ప్రకారం, ఈ మహిళా పారిశ్రామికవేత్తలు దాదాపు 4,20,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ప్రతి రెస్టారెంట్ సగటున ఆరుగురు వ్యక్తులకు ఉపాధి కల్పిస్తుండటం మహిళా నేతృత్వంలోని వ్యాపారాల వృద్ధిని సూచిస్తోంది. శ్రీదేవి జాస్తి వంటి మార్గదర్శకులకు లభించిన ఈ సన్మానం, ఆహార ఆవిష్కరణలలో హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రత్యేకతను చాటడమే కాకుండా, రాబోయే తరాల మహిళా పారిశ్రామికవేత్తలకు గొప్ప స్ఫూర్తినిస్తోంది.
