Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం కావడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ట్రేడింగ్ చివరి గంటల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. వివరాల్లోకి వెళితే, సెన్సెక్స్ 160.73 పాయింట్లు నష్టపోయి 75,237.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46.10 పాయింట్లు తగ్గి 23,643.50 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో డాలర్‌తో పోలిస్తే […]

Published By: HashtagU Telugu Desk
Stock Market

Stock Market Down

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం కావడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ట్రేడింగ్ చివరి గంటల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.

వివరాల్లోకి వెళితే, సెన్సెక్స్ 160.73 పాయింట్లు నష్టపోయి 75,237.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46.10 పాయింట్లు తగ్గి 23,643.50 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 96.14కు పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో దిగుమతి ఖర్చులు, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగాయి. దీనికి తోడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2.9 శాతం పెరిగి బ్యారెల్‌కు 108.8 డాలర్లకు చేరడం కూడా అమ్మకాలకు దారితీసింది.

నిఫ్టీ సూచీలో హిందాల్కో ఇండస్ట్రీస్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా వరుసగా 0.45 శాతం, 0.61 శాతం చొప్పున పడిపోయాయి. రంగాల వారీగా చూస్తే మెటల్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు బలహీనపడగా, ఐటీ, మీడియా సూచీలు మాత్రం కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో ముగిశాయి.

టెక్నికల్‌గా నిఫ్టీకి 23,500 – 23,400 జోన్ కీలక మద్దతుగా పనిచేస్తుందని, ఈ స్థాయిని కోల్పోతే 23,200 వరకు పడిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక డాలర్-రూపాయికి 95.45 వద్ద మద్దతు, 96.20 వద్ద నిరోధం ఉందని వారు అంచనా వేస్తున్నారు.

  Last Updated: 15 May 2026, 05:01 PM IST