Site icon HashtagU Telugu

Repo Rate: ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నో రిలీఫ్‌.. వ‌డ్డీ రేట్లు య‌థాత‌థం..!

Repo Rate

Repo Rate

Repo Rate: శుక్రవారం జరిగిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా సామాన్యులకు రుణ ఈఎంఐల్లో ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఈ సమావేశంలో రెపో రేటులో (Repo Rate) ఎలాంటి మార్పు చేయలేదు. ఇది 6.5 శాతం వద్ద మాత్రమే కొనసాగుతోంది. ఇందులో ఎలాంటి మార్పు లేనందున, గృహ రుణంతో సహా ఇతర రకాల రుణాల EMIలో ఎటువంటి మార్పు లేదు. ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించవచ్చని సామాన్యులు భావించారు.

అయితే, రిజర్వ్ బ్యాంక్ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయదని నిపుణులు ముందుగానే భావించారు. మరోవైపు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కెనడా రెపో రేటును తగ్గించడం ప్రారంభించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా సమావేశం కూడా జరగనుంది. అందులో వడ్డీ రేట్లపై ఆ బ్యాంకు కూడా నిర్ణయం తీసుకుంటుంది.

Also Read: Rains Alert: ఐఎండీ అల‌ర్ట్‌.. నేడు ఈ రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు..!

ఇంకా ఉపశమనం క‌ష్ట‌మే

రెపో రేటుపై ఇంకా ఉపశమనం లభించే అవకాశం లేదు. నిజానికి ప్రస్తుతం ద్రవ్యోల్బణం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే ఎక్కువగా ఉంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.83 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం రేటును 2 నుంచి 4 శాతం మధ్యకు తీసుకురావాలని ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్‌కు టార్గెట్ ఇచ్చింది. ఇటువంటి పరిస్థితిలో ద్రవ్యోల్బణం రేటు ఈ పరిధిలోకి రాని వరకు రెపో రేటును తగ్గించే అవ‌కాశం లేదు. ఎంపీసీ తదుపరి సమావేశం సెప్టెంబర్ మొదటి వారంలో జరగనుంది. ఈ పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆ సమయంలో రెపో రేటులో కొంత కోత పెట్టవచ్చని భావిస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

రెపో రేటు అంటే ఏమిటి..? సామాన్యులపై దాని ప్రభావం ఏమిటి?

రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు ఇచ్చే రుణాల రేటును రెపో రేటు అంటారు. రెపో రేటు పెంపుదల అంటే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నుండి ఖరీదైన రేట్లకు రుణాలు పొందుతాయి. బ్యాంకులు ఖరీదైన రుణాలు పొందినప్పుడు.. వారు గృహ రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు వంటి వాటిని ఖరీదైన వడ్డీ రేట్లకు కస్టమర్లకు విధిస్తారు. ఇది రుణం తీసుకునే వారిపై EMI భారాన్ని పెంచుతుంది.

Exit mobile version