PM Kisan: దేశంలోని కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 22వ విడతకు సంబంధించిన రూ. 2000 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ 22వ విడత నిధులు ఈ వారంలో లేదా మార్చి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది మొదటి విడతను విడుదల చేయడానికి ముందే ప్రభుత్వం లబ్ధిదారుల జాబితా నుండి లక్షలాది మంది రైతుల పేర్లను తొలగించింది. ఇటీవల జరిపిన తనిఖీల్లో లక్షలాది మంది రైతులు అనర్హులుగా తేలడంతో వారి విడతలను నిలిపివేశారు. పథకంలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
పేర్లు ఎందుకు తొలగిస్తున్నారు?
పీఎం కిసాన్ పోర్టల్ ప్రకారం ప్రధానంగా ఈ రెండు కారణాల వల్ల ఫిజికల్ వెరిఫికేషన్ (క్షేత్రస్థాయి పరిశీలన) జరుగుతోంది. నిధులు నిలిపివేయబడుతున్నాయి.
భూమి యాజమాన్య హక్కుల్లో మార్పు: 2019 ఫిబ్రవరి 01 తర్వాత భూమిని తమ పేరుపైకి మార్చుకున్న రైతుల పత్రాలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ తేదీ కంటే ముందు మీకు సాగు భూమి లేకపోతే మీ అర్హతను మళ్లీ తనిఖీ చేస్తారు.
ఒకే కుటుంబం, బహుళ లబ్ధిదారులు: నిబంధన ప్రకారం ఒక కుటుంబంలో (భర్త, భార్య, మైనర్ పిల్లలు) కేవలం ఒక్కరు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందాలి. కానీ చాలా ఇళ్లలో భార్యాభర్తలిద్దరూ విడతలను తీసుకుంటున్నట్లు తనిఖీల్లో తేలింది. ఇటువంటి కేసుల్లో వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు డబ్బు నిలిపివేసారు. ఒకవేళ వెరిఫికేషన్లో మీరు అనర్హులని తేలితే గతంలో తీసుకున్న విడతల సొమ్మును కూడా తిరిగి వసూలు చేసే అవకాశం ఉంది.
Also Read: మార్చి 3న భారత్లో ‘బ్లడ్ మూన్’!
మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
లిస్టులో మీ పేరు ఉందో లేదో అని మీకు సందేహం ఉంటే ఈ క్రింది సులభమైన స్టెప్స్ ద్వారా తనిఖీ చేయండి.
- ముందుగా అధికారిక పోర్టల్ pmkisan.gov.in సందర్శించండి.
- హోమ్పేజీలో ‘Farmers Corner’ కి వెళ్లి ‘Beneficiary Status’ లేదా ‘Know Your Status’ పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేయండి.
- ‘Get Data’ పై క్లిక్ చేయగానే మీ వివరాలన్నీ కనిపిస్తాయి. అక్కడ e-KYC, Land Seeding అనే ఆప్షన్ల వద్ద ‘YES’ ఉందో లేదో చూసుకోండి.
22వ విడత ఎప్పుడు వస్తుంది?
ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. కానీ మీడియా నివేదికల ప్రకారం.. ఈ వారం లేదా మార్చి 2026 మొదటి వారం. మార్చి 4న హోలీ పండుగ ఉన్నందున అంతకంటే ముందే రైతుల ఖాతాల్లో రూ. 2000 జమ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ పనులు వెంటనే చేయండి, లేదంటే డబ్బు రాదు
ఒకవేళ మీరు ఇంకా e-KYC పూర్తి చేయకపోయినా లేదా మీ బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయకపోయినా మీ విడత నిలిచిపోవడం ఖాయం. దీనిని మీరు దగ్గరలోని CSC సెంటర్లో లేదా పీఎం కిసాన్ యాప్ ద్వారా ‘ఫేస్ ఆథెంటికేషన్’ తో పూర్తి చేసుకోవచ్చు.
