Site icon HashtagU Telugu

Net Direct Tax Collections: బ‌డ్జెట్‌కు ముందు కేంద్రానికి గుడ్ న్యూస్.. ప్రత్యక్ష పన్నుల ద్వారా పెరిగిన ఆదాయం..!

Net Direct Tax Collections

Net Direct Tax Collections: 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన వార్తను అందుకుంది. వాస్తవానికి ప్రత్యక్ష పన్నుల (Net Direct Tax Collections) ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుండగా, ఈ ఏడాది ఇప్పటివరకు 24 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. తాజా సమాచారం ప్రకారం ఈ విషయం వెల్లడైంది.

5.75 లక్షల కోట్లకు చేరింది

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) శుక్రవారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఈ ఏడాది ఇప్పటివరకు 24.07 శాతం పెరిగి రూ.5.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ డేటా జూలై 11, 2024 వరకు ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.4.80 లక్షల కోట్లు ఆర్జించింది. CBDT డేటా ప్రకారం.. ఈ ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్ల సంఖ్యకు కార్పొరేట్ పన్ను 2.1 లక్షల కోట్ల రూపాయలను అందించింది. కాగా మొత్తం వసూళ్లలో వ్యక్తిగత ఆదాయపు పన్ను సహకారం రూ.3.46 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్ల గణాంకాలలో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) ద్వారా వచ్చే ఆదాయాలు కూడా ఉన్నాయి.

Also Read: SpaceX : తప్పుడు కక్ష్యలోకి ‘స్టార్‌లింక్’ శాటిలైట్స్.. ఏమైందంటే..

జూన్ నెలలో ఇంత సంపాదించారు

జూన్‌ నెలలోనే పన్నుల వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి రూ.4.50 లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. జూన్ నెలలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.4.62 లక్షల కోట్లు వచ్చినట్లు సీబీడీటీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య జూన్ 2023లో ప్రత్యక్ష పన్ను ఆదాయాల కంటే 20.99 శాతం ఎక్కువ. జూన్ నెలలో వసూళ్లలో కార్పొరేట్ పన్ను రూ. 1.8 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను రూ. 2.81 లక్షల కోట్లు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

గతేడాది ఈ సంఖ్య బాగా పెరిగింది

గత ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ప్రభుత్వానికి ఎంతో ఊరటనిచ్చాయి. మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 17.7 శాతం పెరిగి మొత్తం రూ. 19.58 లక్షల కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పెరుగుదలలో వ్యక్తిగత ఆదాయపు పన్ను సహకారం గణనీయంగా ఉంది. మొత్తం వసూలులో వ్యక్తిగత ఆదాయపు పన్ను సహకారం 53.3 శాతానికి పెరగగా, కార్పొరేట్ పన్ను సహకారం 46.5 శాతానికి తగ్గింది.

వారం రోజుల తర్వాత బడ్జెట్ రాబోతోంది

దాదాపు 10 రోజుల‌ తర్వాత ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈ పన్ను వసూళ్ల సంఖ్య వచ్చింది. పార్లమెంటు కొత్త సమావేశాలు జూలై 22 నుండి ప్రారంభం కానున్నాయి. సెషన్ రెండవ రోజు అంటే జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు.

Exit mobile version