Mobile Phones: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో మొబైల్ ఫోన్లు, ఛార్జర్ల ధరలను (Mobile Phones) తగ్గించడంపై ఆమె మాట్లాడారు. మొబైల్స్, ఛార్జర్లపై ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని 20% నుంచి 15%కి తగ్గించిందని చెప్పారు. అంటే ఇప్పుడు ప్రజలు మొబైల్, ఛార్జర్ కొనుగోలుపై 5% తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో 5% తగ్గింపు తర్వాత ఫోన్, ఛార్జర్ను ఎంత ధరకు కొనుగోలు చేయవచ్చు అనే ప్రశ్న మీ మనస్సులో తలెత్తవచ్చు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు కొనబోయే ఫోన్ ధర రూ.20 వేలు అనుకుందాం. గతంలో దానిపై 20% సుంకం ఉండేది. అంటే రూ.20 వేలపై రూ.4 వేలు కస్టమ్ డ్యూటీ విధించిన తర్వాత ఈ ఫోన్ ధర రూ.24000 అవుతుంది. కానీ ఇప్పుడు 5% తగ్గించారు. అంటే రూ.20 వేల విలువైన ఫోన్పై 15% కస్టమ్ డ్యూటీ విధించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.20 వేలపై 15% కస్టమ్ డ్యూటీ విధిస్తే రూ.3 వేలు అవుతుంది. అంటే మీ ఫోన్ ధర రూ.23 వేలు అవుతుంది. అసలు విషయం ఏంటంటే.. రూ.24 వేలు చెల్లించి కొనుగోలు చేయాల్సిన ఫోన్ ఇప్పుడు రూ.23 వేలు చెల్లించాల్సి వస్తోంది. అంటే వెయ్యి రూపాయలు ఆదా అవుతుంది.
Also Read: Rains Alert: మూడురోజులు వర్షాలు.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్షసూచన
ఛార్జర్ ధర ఎంత?
మొబైల్ ఫోన్ల మాదిరిగానే ఇప్పుడు ఛార్జర్లపై కూడా 15% కస్టమ్ డ్యూటీ విధించనున్నారు. మీ ఛార్జర్ ధర రూ. 1000 ఉందనుకోండి. దానిపై 20% కస్టమ్ డ్యూటీ ఉంటే రూ. 1000లో 20% రూ. 200 అవుతుంది. అంటే ఛార్జర్ కోసం రూ.1200 వెచ్చించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు 15% కస్టమ్ డ్యూటీ ప్రకారం రూ.1150 వెచ్చించాల్సి ఉంటుంది. మొత్తంమీద రూ. 20,000 విలువైన ఫోన్ను కొనుగోలు చేసే కస్టమర్ రూ. 1,000 ప్రయోజనం పొందుతారు. రూ. 1,000 విలువైన ఛార్జర్ను కొనుగోలు చేసిన కస్టమర్ రూ. 50 ప్రయోజనం పొందుతారు.
We’re now on WhatsApp. Click to Join.