Shock : ఒకే రోజు 400 మందికిపైగా ఉద్యోగుల తొలగించిన ఇన్ఫోసిస్‌

Shock : బాధిత ఉద్యోగులు మరియు ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఎన్ఐటీఈఎస్‌) కలిసి కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు

Published By: HashtagU Telugu Desk
Infosys 400 Employees

Infosys 400 Employees

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys fired around 400 trainees) ఒకే రోజు 400 మందికిపైగా ట్రైనీ ఉద్యోగులను తొలగించడంపై కేంద్ర కార్మికశాఖ తీవ్రంగా స్పందించింది.ఉద్యోగులందరినీ ఒకేసారి తొలగించిన ఇన్ఫోసిస్, సెక్యూరిటీ సిబ్బందితో వారిని బయటకు పంపించి వేసింది. దీంతో బాధిత ఉద్యోగులు మరియు ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఎన్ఐటీఈఎస్‌) కలిసి కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన తర్వాత కేంద్ర కార్మిక శాఖ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.

Telangana Cong Incharge: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియామకం

రాత్రివేళ బయటకు పంపితే ఎక్కడకు వెళ్లాలని, ఈ ఒక్క రాత్రి హాస్టల్‌లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి బతిమాలినా కంపెనీ నిరాకరించింది. దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు రాత్రంతా క్యాంపస్ బయట రోడ్డుపైనే గడిపారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అయ్యాయి. మరోవైపు, ఉద్యోగుల తొలగింపును ఇన్ఫోసిస్ సమర్థించుకుంది. సంస్థలో నియామక ప్రక్రియ కఠినంగా ఉంటుందని, మైసూర్ క్యాంపస్‌లో ప్రాథమిక శిక్షణ పొందిన తర్వాత ఇంటర్నల్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సిందేనని పేర్కొంది. వారికి మూడు అవకాశాలు ఉంటాయని, అప్పుడు కూడా ఉత్తీర్ణత సాధించకుంటే సంస్థలో పనిచేసే అవకాశం ఉండదని తెలిపింది. ఈ విషయమై వారితో ముందుగానే ఒప్పందం చేసుకుంటామని వివరించింది.

ఈ సంఘటన ఐటీ రంగంలో ఉద్యోగుల భద్రత మరియు వారి హక్కులపై తీవ్ర చర్చలను ప్రారంభించింది. ఉద్యోగులను సామూహికంగా తొలగించడం మరియు వారికి తాత్కాలిక ఆశ్రయం కూడా అందించకపోవడం వంటి విషయాలు ఐటీ రంగంలోని పాలసీలపై ప్రశ్నలను ఎత్తిపడుతున్నాయి. కేంద్ర కార్మిక శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది.

  Last Updated: 15 Feb 2025, 07:49 AM IST