Indian Railway Loss: ప్రపంచంలోని అత్యంత పొడవైన రైలు నెట్వర్క్లలో ఒకటైన భారతీయ రైల్వేలు (Indian Railway Loss) ఇటీవలి సంవత్సరాలలో నష్టాలను ఆర్జించే సంస్థగా కాకుండా లాభాలను ఆర్జించే సంస్థగా పేరుగాంచాయి. భారతీయ రైల్వే ప్రతిరోజూ 12,817 రైళ్లను నడుపుతోంది. వీటిలో సుమారు 2.3 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. పండుగ రోజుల్లో రైల్వే టికెట్ పొందడం యుద్ధంతో కూడుకున్న పని అందరికీ తెలిసిందే. దీని వల్ల అనేక భారతీయ రైళ్లు కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. రైల్వేస్ విడుదల చేసిన డేటా ప్రకారం.. బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ 2023-24 సంవత్సరంలో రూ.176 కోట్లు ఆర్జించింది. లాభం లేని రైలు ఉందని, కోట్లాది రూపాయల నష్టం ఉందని ఎవరైనా చెబితే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రైలు దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్. ఇది భారతీయ రైల్వేలకు బదులుగా IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ద్వారా నిర్వహించబడుతుంది. తేజస్ ఎక్స్ప్రెస్ రైలుకు ఇప్పటి వరకు రూ.62,88,00000 అంటే దాదాపు రూ.63 కోట్లు నష్టాల్లో ఉన్నట్లు అంచనా.
రెండు తేజస్ రైళ్లు నష్టాల్లో
IRCTC ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్వర్క్లో రెండు తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతోంది. వీటిలో ఒకటి ఢిల్లీ నుండి లక్నో మధ్య, మరొకటి ముంబై నుండి అహ్మదాబాద్ మధ్య నడుస్తుంది. ఈ రెండు రైళ్లు నష్టాల్లో నడుస్తున్నాయి. 2019 సంవత్సరంలో కరోనా కాలానికి ముందు ప్రారంభించిన తేజస్ ఎక్స్ప్రెస్ రైలును నిర్వహించే బాధ్యత IRCTCకి ఇవ్వబడింది. దేశంలో ప్రైవేట్ రైళ్లను నడపడానికి ఇది మొదటి అడుగు అని అప్పట్లో చెప్పబడింది. ప్రారంభంలో తేజస్ ఎక్స్ప్రెస్కు చాలా మంది ప్రయాణికులు వచ్చారు. ఎయిర్ హోస్టెస్ల వలె దుస్తులు ధరించిన మహిళా సహాయకులు, ప్రత్యేకమైన సౌకర్యాలు ఈ రైలులో ప్రయాణించడానికి ప్రజలను ప్రోత్సహించాయి. 2019-20 సంవత్సరంలో ఈ రైలు ఢిల్లీ-లక్నో మార్గంలో 2.33 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది, అయితే మొదట కరోనా మహమ్మారి కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ రైలు ప్రయాణికులను పొందడం ఆగిపోయింది.
Also Read: BigBasket: ఎలక్ట్రానిక్ వస్తువుల డెలివరీ ప్లాట్ఫామ్లోకి బిగ్ బాస్కెట్..!
మూడేళ్లలో రూ.63 కోట్ల నష్టం వచ్చింది
IRCTC ఇచ్చిన డేటా ప్రకారం.. ఈ రైలు 2020-21 సంవత్సరంలో రూ. 16.69 కోట్ల నష్టాన్ని చవిచూడగా, 2021-22లో ఈ నష్టం రూ. 8.50 కోట్లు. దీని తర్వాత రైలు నష్టాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కేవలం మూడేళ్లలో ఈ రైలు నష్టం రూ.63.88 కోట్లకు చేరింది. ఢిల్లీ-లక్నో తేజస్ రైలు రూ.27.52 కోట్ల నష్టంతో నడుస్తోంది.
తేజస్ ఎక్స్ప్రెస్ రైలు నష్టాలను నిరంతరం పెంచడానికి కారణం దాని నుండి ప్రయాణీకులు దూరంగా ఉండటమే. ఈ రైలులో ప్రతిరోజూ సగటున 200 నుండి 250 సీట్లు ఖాళీగా ఉంటున్నాయి డేటా చెబుతుంది. ప్రయాణీకుల కొరత, పెరుగుతున్న నష్టాల కారణంగా మొదటి వారంలో ఆరు రోజులు నడిచిన తేజస్ ఎక్స్ప్రెస్ ట్రిప్పులు కూడా తగ్గాయి. ఇప్పుడు ఈ రైలు వారానికి నాలుగు రోజులు మాత్రమే నడుస్తుంది.
మొదట్లో ప్రజలు తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించడాన్ని స్టేటస్ సింబల్గా భావించారు. కానీ అధిక ఛార్జీల కారణంగా అది క్రమంగా ప్రత్యామ్నాయ రైలుగా మారింది. రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం రాజధాని-శతాబ్ది ఎక్స్ప్రెస్లో కూడా తేజస్తో సమానమైన సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఛార్జీ చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజధాని, శతాబ్ది టిక్కెట్లు దొరకని ప్రయాణికులు తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారు.