Site icon HashtagU Telugu

New Cheque System: చెక్ క్లియరెన్స్‌లో కీల‌క మార్పులు.. ఇకపై కొన్ని గంటల్లోనే డ‌బ్బులు!

New Cheque System

New Cheque System

New Cheque System: భారతదేశంలో చెక్ క్లియరింగ్ (New Cheque System) విధానంలో ఒక చారిత్రక విప్లవం రానుంది. రేపు అంటే అక్టోబర్ 4, 2025 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆధ్వర్యంలో నిరంతర చెక్ క్లియరింగ్ సిస్టమ్ (Continuous Check Clearing System) దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ఈ సమూల మార్పుతో ఇప్పటివరకు 1-2 పనిదినాలు పట్టిన చెక్ క్లియరింగ్ సమయం ఇకపై కొన్ని గంటలకు తగ్గిపోనుంది. ఈరోజు అంటే అక్టోబర్ 3న ఈ కొత్త వ్యవస్థ సజావుగా పనిచేయడానికి సిద్ధంగా ఉందో లేదో నిర్ధారించుకోవడానికి RBI అన్ని బ్యాంకుల భాగస్వామ్యంతో ట్రయల్ రన్ నిర్వహించింది.

నిరంతర ప్రాసెసింగ్, రియల్-టైమ్ సెటిల్‌మెంట్

కొత్త విధానం ప్రకారం.. చెక్కుల ప్రాసెసింగ్ పాత ‘బ్యాచ్-ఆధారిత’ పద్ధతి నుంచి వైదొలగి రియల్-టైమ్ విధానంలోకి మారుతుంది. బ్యాంకులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ప్రెజెంటేషన్ సెషన్స్‌లో నిరంతరం చెక్కులను స్కాన్ చేసి క్లియరింగ్ హౌస్‌కు పంపుతాయి. దాదాపు ప్రతి చెక్ క్షణాల్లో క్లియర్ అవుతుంది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న T+1 (ఒక పనిదినం) క్లియరింగ్ సమయం కేవలం కొన్ని గంటలకు పరిమితమవుతుంది.

RBI ఆదేశాల ప్రకారం చెక్కును జారీ చేసిన బ్యాంకు (డ్రాయీ బ్యాంక్) నిర్ణీత సమయంలో చెక్కును ‘పాజిటివ్’ లేదా ‘నెగెటివ్’ అని ధృవీకరించాలి. ఒకవేళ బ్యాంకు ఎటువంటి స్పందనా ఇవ్వకపోతే ఆ చెక్ ఆమోదించబడినట్లుగా పరిగణించబడుతుంది.

Also Read: CM Chandrababu: ఉత్తరాంధ్ర వరదలపై సీఎం సమీక్ష.. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం!

రెండు దశల్లో కొత్త విధానం అమలు

ఈ కొత్త విధానం రెండు దశల్లో అమలు చేయబడుతుంది.

మొదటి దశ (అక్టోబర్ 4, 2025- జనవరి 2, 2026): ఈ సమయంలో చెక్కును ఆమోదించడానికి బ్యాంకులకు సాయంత్రం 7 గంటల వరకు గడువు ఉంటుంది. సెటిల్‌మెంట్ ఉదయం 11 గంటల నుండి ప్రతి గంటకు జరుగుతుంది.

రెండవ దశ (జనవరి 3, 2026 నుండి): ఈ దశలో ధృవీకరణ సమయాన్ని మరింత తగ్గిస్తారు. ప్రతి చెక్కును ఆమోదించడానికి బ్యాంకులకు కేవలం 3 గంటల సమయం మాత్రమే ఉంటుంది (ఉదాహరణకు 10-11 AM మధ్య వచ్చిన చెక్కును 2 PM లోగా ధృవీకరించాలి). సెటిల్‌మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాంకులు కేవలం ఒక గంటలోపు ఖాతాదారులకు డబ్బును విడుదల చేయాలని RBI స్పష్టం చేసింది.

ఖాతాదారులకు ప్రయోజనాలు

ఈ నిరంతర క్లియరింగ్ విధానం దేశవ్యాప్తంగా RBI మూడు క్లియరింగ్ గ్రిడ్‌లైన ఢిల్లీ, ముంబై, చెన్నై పరిధిలోని అన్ని బ్యాంకులకూ వర్తిస్తుంది. దీని వల్ల ఖాతాదారులకు ప్రధానంగా కింది ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

బ్యాంకింగ్ వ్యవస్థలో సామర్థ్యం, పారదర్శకతను పెంచే లక్ష్యంతో RBI తీసుకువచ్చిన ఈ మార్పు ఆర్థిక లావాదేవీల వేగాన్ని మరింత పెంచనుంది. ఖాతాదారులు ఈ పరివర్తన సమయంలో తమ బ్యాంకుల నుండి అప్‌డేట్‌లను తెలుసుకుంటూ ఉండాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.

Exit mobile version