Site icon HashtagU Telugu

Indian Currency Notes: రూ. 2వేల నోటు ముద్రించ‌డానికి అయిన ఖ‌ర్చు ఎంతో తెలుసా..?

Rs 2000 Notes

Rs 2000 Notes

Indian Currency Notes: ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8, 2016న నోట్ల రద్దును ప్రకటించారు. ఈ క్రమంలో రూ.500, రూ.1000 నోట్లను నిలిపివేశారు. దీని తరువాత ప్రజల సమస్యలను త్వరగా తొలగించడానికి కేంద్ర‌ ప్రభుత్వం 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. కానీ దాని జీవితకాలం 7 సంవత్సరాల కంటే తక్కువ. ప్రభుత్వం మే 19, 2023న దాన్ని వాడ‌కాన్ని నిర్మూలించింది. అలాగే డిపాజిట్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది ఆర్బీఐ. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ రూ.7409 కోట్ల విలువైన రూ.2000 నోట్లు తిరిగి రాలేదు. ఇప్పుడు రూ.2000 నోటు ముద్రణ (Indian Currency Notes)కు రూ.3.54 వెచ్చించాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. 1000 నోట్ల ఈ కట్ట ముద్రణ ఖర్చు రూ.3540.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాచారం అందించారు

జూలై 2016- జూన్ 2018 మధ్య అన్ని కొత్త నోట్ల ముద్రణ ఖర్చు 12,877 కోట్ల రూపాయలు అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రకారం 370.2 కోట్ల రూపాయల 2000 నోట్లను సరఫరా చేసినట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. దీని విలువ రూ.7.40 లక్షల కోట్లు. రూ.2000 నోట్లతో పాటు రూ.500, రూ.200, రూ.100, రూ.20, రూ.20, రూ.10ల కొత్త సిరీస్ నోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

Also Read: Wayanad Landslides : వరద బాధితుల కోసం కదిలిన చిత్రసీమ

ఒక్క నోటుపై ప్రభుత్వం రూ.3.54 వెచ్చించాల్సి వచ్చింది

రూ.2000 నోట్ల ముద్రణ ఖర్చు రూ.3540 (వెయ్యి నోట్ల ఖ‌ర్చు) అని ఆర్థిక మంత్రి తెలిపారు. దీని ప్రకారం ఒక్క నోటుపై ప్రభుత్వం రూ.3.54 వెచ్చించాల్సి వచ్చింది. దీని ప్రకారం 370.2 కోట్ల నోట్ల ముద్రణకు రూ.1310.50 కోట్లు ఖర్చు చేశారు. మే 19, 2023న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయని, వీటిలో రూ.3.48 లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చేశాయ‌ని ఆర్థిక మంత్రి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

2000 రూపాయల నోట్లలో 2 శాతానికి పైగా తిరిగి రాలేదు

నవంబర్ 2026లో రూ.500, రూ.1000 నోట్లు మొత్తం నోట్లలో 86.4 శాతంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. అందుకే రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. దాని ఉద్దేశ్యం నెరవేరిన తర్వాత వాడ‌కం నిషేధించారు. రూ.2000 నోట్లకు కూడా ప్రజలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు. అయితే రూ.2000 నోట్లలో 2.08 శాతం ఇంకా వాపస్ రాలేదని తెలిపారు.