Site icon HashtagU Telugu

Bloomberg Billionaires: ప్ర‌పంచంలో టాప్‌-50 సంప‌న్న వ్య‌క్తుల‌లో ఐదుగురు భార‌తీయుల‌కు చోటు..!

Bloomberg Billionaires

Bloomberg Billionaires

Bloomberg Billionaires: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాను బ్లూమ్‌బెర్గ్ (Bloomberg Billionaires) విడుదల చేసింది. ఇందులో ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. భారత్ నుంచి ముఖేష్ అంబానీ 12వ స్థానంలో, గౌతమ్ అదానీ 13వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో ప్రపంచంలోని టాప్ 50 సంపన్న వ్యక్తులలో భారతదేశానికి చెందిన 5 మంది వ్యక్తులు ఉన్నారు. ఇందులో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలతో పాటు షాపూర్ మిస్త్రీ, సావిత్రి జిందాల్, శివ్ నాడార్ ఉన్నారు.

ప్రపంచంలోని టాప్ 3 ధనవంతులు వీరే

బ్లూమ్‌బెర్గ్ జాబితా ప్రకారం.. జెఫ్ బెజోస్ 205 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 17 లక్షల కోట్లు) యజమాని. అతని సంపద 147 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1226 కోట్లు) తగ్గింది. రెండవ స్థానంలో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. ఇత‌ని సంపద జెఫ్ బెజోస్ కంటే చాలా తక్కువ కాదు. జాబితా ప్రకారం.. బెర్నార్డ్ 203 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 16.93 లక్షల కోట్లు) యజమాని. ఆయన సంపద 6.73 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 56 వేల కోట్లు) తగ్గింది. టెస్లా యజమాని ఎలాన్ మస్క్ సంపద 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3336 కోట్లు) క్షీణించింది. అతను ఈ జాబితాలో మూడవ స్థానానికి చేరుకున్నాడు. అలెన్ 202 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 16.85 లక్షల కోట్లు) యజమాని.

Also Read: Telangana’s New Emblem : రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ గుర్తింపు తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం 

ముఖేష్ అంబానీ రూ.9.17 లక్షల కోట్లకు యజమాని

ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీ 12వ స్థానంలో, గౌతమ్ అదానీ 13వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ 110 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 9.17 లక్షల కోట్లు) యజమాని. ఆయన సంపద 1.53 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 13 వేల కోట్లు) తగ్గింది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ తర్వాత గౌతమ్ అదానీ పేరు ఉంది. గౌతమ్ అదానీ 106 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8.84 లక్షల కోట్లు) యజమాని. ఆయ‌న సంపద కూడా తగ్గిపోయింది. అదానీ సంపద 79.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 663 కోట్లు) తగ్గింది.

We’re now on WhatsApp : Click to Join

టాప్ 50లో ఈ భారతీయులు కూడా ఉన్నారు

బ్లూమ్‌బెర్గ్ టాప్ 50 సంపన్నుల జాబితాలో భారతదేశానికి చెందిన షాపూర్ మిస్త్రీ (44వ), సావిత్రి జిందాల్ (49వ), శివ్ నాడార్ (50వ) కూడా ఉన్నారు. షాపూర్ మిస్త్రీకి 37.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3.10 లక్షల కోట్లు), సావిత్రి జిందాల్ 32.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2.72 లక్షల కోట్లు), శివ్ నాడార్ 32.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2.68 లక్షల కోట్లు) కలిగి ఉన్నారు.