Free Internet: మొబైల్ వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్‌.. ప్ర‌తి ఒక్క‌రికి ఉచితంగా డేటా..?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతి పౌరుడికి ఉచిత ఇంటర్నెట్ (Free Internet) హక్కును కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Published By: HashtagU Telugu Desk
Free Internet

Free Internet

Free Internet: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23, 2024న బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు. ఒక నెల క్రితం జూన్ 2024 చివరి వారంలో దేశంలోని మూడు టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను 25 శాతం పెంచి యూజ‌ర్ల‌పై భారాన్ని పెంచాయి. టెలికాం కంపెనీలు డేటా ధరలను కూడా పెంచినందున మొబైల్‌లో నెట్ సర్ఫింగ్ కూడా ఖరీదైనదిగా మారింది. అయితే బడ్జెట్‌లో ఖరీదైన డేటా నుండి ఉపశమనం క‌లిగే అవకాశం ఉంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతి పౌరుడికి ఉచిత ఇంటర్నెట్ (Free Internet) హక్కును కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో నివసించే వెనుకబడిన, పేద, ప్రజలకు ఉచిత ఇంటర్నెట్ అందించడానికి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజ్యసభలో చర్చించనున్నారు. బిల్లులోని ఉపోద్ఘాతం ప్రకారం.. దేశంలోని పౌరులు ఇంటర్నెట్ కనెక్టివిటీని కోల్పోకూడదు. ప్రతిపాదన ప్రకారం.. ఇంటర్నెట్ సౌకర్యాలను యాక్సెస్ చేయకుండా నిరోధించే ఎలాంటి రుసుము లేదా ఛార్జీని చెల్లించడానికి ఏ పౌరుడు బాధ్యత వహించే అవ‌కాశం లేదు.

Also Read: ICC Meeting: రెండు దేశాల‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. నిబంధ‌న‌లు పాటించ‌కుంటే స‌స్పెండ్‌ చేసే ఛాన్స్‌..!

ఈ బిల్లును సీపీఎం ఎంపీ వి శివదాసన్ 2023 డిసెంబర్‌లో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభ బులెటిన్ ప్రకారం.. బిల్లును పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రపతి సిఫార్సు చేసినట్లు టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తెలియజేశారు. ప్రైవేట్ సభ్యుల బిల్లును అమలు చేయడానికి అయ్యే ఖర్చులను తీర్చడానికి, బిల్లును చర్చించాలా వద్దా అని నిర్ణయించిన మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రపతి ఆమోదం అవసరం.

బిల్లు ప్రకారం.. ప్రతి పౌరుడికి ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ హక్కు ఉండాలి. ప్రభుత్వం సార్వత్రిక యాక్సెస్ కింద పౌరులందరికీ ఉచిత ఇంటర్నెట్‌ను అందించాలి. వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో నివసించే పౌరులకు ఉచిత ఇంటర్నెట్ అందించాలి. పౌరులందరికీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం నేరుగా పౌరులకు ఇంటర్నెట్ అందించాలని లేదా ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ అందించే సేవపై సబ్సిడీని అందించాలని బిల్లులో పేర్కొంది. బిల్లు ప్రతిపాదన ప్రకారం ఈ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నిధులు కూడా మంజూరు చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 23 Jul 2024, 08:53 AM IST