కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం

ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 మధ్య లభించిన ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో అయితే ఒక్క గుడ్డు ధర రూ.7.30కు మించి ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Egg prices soar, burden on the nutritional needs of the common man

Egg prices soar, burden on the nutritional needs of the common man

. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర రూ.8

. ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం

. మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం

Egg Price Hike: సామాన్య ప్రజల భోజనపట్టికలో కీలకమైన కోడిగుడ్డు ఇప్పుడు ఖరీదైన వస్తువుగా మారుతోంది. ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 మధ్య లభించిన ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో అయితే ఒక్క గుడ్డు ధర రూ.7.30కు మించి ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. దీంతో రోజువారీ అవసరాల కోసం గుడ్లు కొనుగోలు చేయడం సామాన్య కుటుంబాలకు భారంగా మారింది. ఇదే సమయంలో నాటు కోడిగుడ్ల ధరలు మరింత పెరిగి ఒక్కొక్కటి రూ.15 వరకు విక్రయమవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగులకు పౌష్టికాహారంగా ఉపయోగించే గుడ్డు ధరలు ఇలా పెరగడం ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతోంది.

గత కొన్ని రోజుల క్రితం వరకు 30 గుడ్లు ఉన్న ఒక ట్రే ధర హోల్‌సేల్ మార్కెట్లో రూ.160 నుంచి రూ.170 మధ్య ఉండేది. అయితే ప్రస్తుతం అదే ట్రే ధర రూ.210 నుంచి రూ.220కి చేరింది. ఈ పెరుగుదలతో రిటైల్ వ్యాపారులు కూడా వినియోగదారులపై ధర భారాన్ని మోపక తప్పని పరిస్థితి ఏర్పడింది. పౌల్ట్రీ వ్యాపారుల ప్రకారం, డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడమే ఈ ఆకస్మిక ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో గుడ్ల వినియోగం పెరిగినా, ఉత్పత్తి మాత్రం తగ్గిపోవడంతో మార్కెట్‌లో అసమతుల్యత ఏర్పడింది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 8 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగేది. అయితే ఇటీవల కాలంలో కోళ్లకు అవసరమైన దాణా, మక్కలు, చేపపొట్టు వంటి ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో చాలా మంది రైతులు పౌల్ట్రీ ఫారాల నిర్వహణను నిలిపివేశారు.

పెరిగిన ఖర్చులకు తగిన లాభాలు రాకపోవడంతో చిన్న, మధ్యతరహా రైతులు రంగం నుంచి తప్పుకోవడం ఉత్పత్తి తగ్గుదలకు దారితీసింది. ప్రస్తుతం హోల్‌సేల్‌లో రూ.7.30, రిటైల్‌లో రూ.8 పలుకుతున్న ధర పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైమ్ గరిష్ఠం. కనీసం మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు అని ఒక కోడిగుడ్ల వ్యాపారి తెలిపారు. ఉత్పత్తి మళ్లీ సాధారణ స్థాయికి చేరే వరకు ధరలు తగ్గే అవకాశాలు తక్కువేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే, కోడిగుడ్ల ధరల పెరుగుదల సామాన్యుడి వంటగదిపై గట్టి ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం లేదా సంబంధిత శాఖలు జోక్యం చేసుకుని రైతులకు మద్దతు ఇస్తేనే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

 

  Last Updated: 21 Dec 2025, 08:03 PM IST