DA Hike: డియర్‌నెస్ అలవెన్స్ పెంపు.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

త్వరలో డీఏ పెంపుపై ప్రభుత్వం ప్రకటించబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Published By: HashtagU Telugu Desk
Central Govt Employees

Central Govt Employees

DA Hike: డియర్‌నెస్ అలవెన్స్ (DA Hike) పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోలీకి ముందు ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పగలదని ఇంతకు ముందు చెప్పేవారు కానీ అది జరగలేదు. 7వ పే కమీషన్ ప్రకారం.. DA/DR సంవత్సరానికి రెండుసార్లు పెరుగుతుంది. మొదటి పెంపు జనవరి 1 నుంచి, రెండోది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ సంవత్సరం మొదటి పెంపుదల అంటే 2025 జనవరి 1 నుండి అమలు చేయవలసి ఉంది. దీని అధికారిక ప్రకటన ఇంకా వేచి ఉంది.

బుధవారం ప్రకటించే అవకాశం ఉంది

మీడియా కథనాల ప్రకారం.. త్వరలో డీఏ పెంపుపై ప్రభుత్వం ప్రకటించబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్‌ సమావేశం బుధవారం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) ఇస్తున్నారు. అయితే, పెన్షనర్లకు దీనిని డియర్‌నెస్ రిలీఫ్ అంటారు. ఇది ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) ఆధారంగా లెక్కించబడుతుంది. ప్రతి ఆరు నెలలకు AICPI సగటు డేటాను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం DA, DR రేట్లను సెట్ చేస్తుంది. ఈ విధంగా ఉద్యోగులు సంవత్సరానికి రెండుసార్లు పెరిగిన డీఏ బహుమతిని పొందుతారు.

Also Read: Teenmar Mallanna : హాట్ టాపిక్ గా కేటీఆర్, మల్లన్న భేటీ..అసలు ఏంజరగబోతుంది..?

పెంపుదల ఎంత ఉంటుంది?

డీఏ అంటే డియర్‌నెస్ అలవెన్స్ ఎంత పెరుగుతుందనే దానిపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇందులో 2% వృద్ధికి అవకాశం ఎక్కువగా ఉందన్నారు. జూలై 2024 నుండి డిసెంబర్ 2024 వరకు AICPI డేటా జనవరి 2025లో DA/DR ఎంత పెరుగుతుందో నిర్ణయిస్తుంది. లేబర్ బ్యూరో ప్రకారం.. డిసెంబర్ 2024కి AICPI 0.8 పాయింట్లు తగ్గి 143.7కి చేరుకుంది. ద్రవ్యోల్బణం తగ్గుదల కారణంగా ఈసారి డీఏ 2% పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతకుముందు మూడు శాతం వృద్ధిని అంచనా వేయగా.. ప్రస్తుతం 53 శాతం చొప్పున డీఏ ఇస్తున్నారు.

జూలై 2024 నుండి నవంబర్ 2024 వరకు ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) డేటా జనవరి 2025లో DA/DRలో కనీసం 3 శాతం పెరుగుదల ఉండవచ్చని చూపుతోంది. కానీ డిసెంబర్ డేటా విడుదల తర్వాత, దాని అవకాశం తగ్గింది. గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం డీఏను 3% పెంచగా, ఆ తర్వాత అది 50 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది.

జనవరి 2025కి DAని 2% పెంచినట్లయితే.. కనీస ప్రాథమిక వేతనం రూ. 18,000 ఉన్న ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు రూ.360 ప్రయోజనం పొందవచ్చు. పెన్షనర్లకు వారి కనీస పెన్షన్ రూ. 9000 అయినందున, వారికి రూ.180 పెంపు ఉంటుంది. అయితే కొన్ని నివేదికలలో 3% పెరుగుదల కూడా అంచనా వేశారు. 3 శాతం పెరుగుదల ప్రకారం ఎంట్రీ లెవల్ ఉద్యోగి నెలవారీ జీతం రూ. 540 పెరగవచ్చు.

 

 

 

  Last Updated: 17 Mar 2025, 03:35 PM IST