Site icon HashtagU Telugu

Rs 8300 Crore Fraud: రూ.8300 కోట్ల కుంభకోణం.. ఇద్దరు భారత సంతతి అమెరికన్లకు జైలు

Rs 7500 Crore Fraud

Rs 8300 Crore Fraud:  వైద్య పెట్టుబడుల రంగం పేరుతో మాయ చేశారు.. వైద్యం కోసం డాక్టర్ల వద్దకు వచ్చేలా రోగులను ఆకర్షిస్తామన్నారు..  ఆరోగ్య రంగానికి సంబంధించిన టీవీ ప్రకటనలను ప్రచారం చేస్తామన్నారు.. అక్రమ మార్గాల్లో భారీగా పెట్టుబడులను సేకరించారు.. ‘ఔట్ కమ్ హెల్త్’ (Outcome) పేరిట కంపెనీని ఏర్పాటు చేసి భారత సంతతికి చెందిన అమెరికన్లు రిషీ షా (38), శ్రద్ధ అగర్వాల్(38)  రూ.8300 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన అమెరికా కోర్టు.. మనీలాండరింగ్ సహా పలు అభియోగాలలో వీరి పాత్ర ఉందని  2023 ఏప్రిల్‌లో తేల్చింది. వారిని దోషులుగా నిర్ధారించింది. తాజాగా వారికి శిక్షలను ప్రకటించింది.  రిషీ షాకు ఏడున్నరేళ్ల జైలుశిక్ష, శ్రద్ధ అగర్వాల్‌కు మూడేళ్ల జైలుశిక్షను అనౌన్స్ చేస్తూ తీర్పును కోర్టు వెలువరించింది. ఇక ఇదే కేసులో ‘ఔట్ కమ్ హెల్త్’  కంపెనీకి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) బ్రాడ్ పర్దీని కూడా దోషిగా(Rs 8300 Crore Fraud) నిర్ధారించారు. ఇతడికి కూడా రెండేళ్ల  జైలుశిక్ష పడింది.  ఈ ముగ్గురు కూడా కోర్టు ఎదుట తమ నేరాన్ని అంగీకరించారు. తాము చేసిన తప్పుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. తప్పుడు పద్ధతులతో పెట్టుబడిదారులను మోసగించినట్లు సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. అందుకే వీరికి విధించే శిక్షలను.. ప్రతివాదులు కోరిన దాని కంటే సగానికి  సగం మేర కోర్టు తగ్గించింది.

We’re now on WhatsApp. Click to Join

ఏమిటీ స్కామ్ ?

Also Read :Majority Population : ఇలాగే జరిగితే.. మెజారిటీ ప్రజలు మైనారిటీలు అవుతారు : హైకోర్టు