బెంగళూరు బేస్డ్ ఆటోమోటివ్ స్టార్టప్ కంపెనీ ప్రవాగ్ తాజాగా మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ డిఫై కార్ ని లాంచ్ చేసింది. కాగా ఈ డిఫై ఎలక్ట్రిక్ ఎస్ యు వి మ్యానుఫ్యాక్చరింగ్ ను వచ్చే ఏడాది రెండవ భాగంలో నుంచి ప్రారంభించబోతున్నట్లు ప్రవైగ్ తెలిపింది. కాగా తాజాగా దేశీయ మార్కెట్ లోకి విడుదలైన కొత్త ప్రవైగ్ డిఫై ధర రూ. 39.50 లక్షలు ఎక్స్-షోరూమ్ గా ఉంది. అయితే ప్రవైగ్ కంపెనీ ఈ ఎస్యూవీ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ. 51,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కానీ డెలివరీలు 2023 ఏప్రిల్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
ఈ ఎస్యూవీ కార్ ని చాలా వరకు ఒక కొత్త డిజైన్ తో రూపొందించారు. ఇందులో పెద్ద పనోరమిక్ సన్రూఫ్ కూడా అందుబాటులో ఉంటుంది. డీఫై ఎలక్ట్రిక్ పొడవు 4,960 ఎంఎంగా ఉంది. ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ 234 ఎంఎం, లెగ్ రూమ్ 1215 ఎంఎంగా ఉంది. హెడ్ రూఫ్ 1050 ఎంఎం గా ఉంది. రికవర్డ్ నైలాన్, పీఈటీ బాటిళ్ల నుంచి టెక్నికల్ టెక్స్టైల్, వేగన్ లేథర్ను ఈ వాహనంలో ఉపయోగిస్తోంది. ప్రవాగ్ డిఫై ఎలక్ట్రిక్ ఎస్యూవీ లో గ్లాస్ స్మూత్ సస్పెన్షన్ను ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కార్ 500కి.మీల వరకు ప్రయాణిస్తుంది.
డిఫై ఎలక్ట్రిక్ టాప్ స్పీడ్ 210కేఎంపీహెచ్. 400 బీహెచ్పీ పవర్, 620 ఎన్ఎం టార్క్ను ఇది జనరేట్ చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, టెయిల్గేట్ మరియు లైట్బార్ స్టైల్ టైల్లైట్లను చూడవచ్చు. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 15.6 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉంటుంది. ప్రవాగ్ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ డిఫై. ఇందుకు సంబంధించిన బుకింగ్స్ కూడా సంస్థ మొదలుపెట్టింది.