భారత మార్కెట్లో మారుతి సుజుకి కార్లకు ఉన్న డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా వాటి మైలేజ్ కారణంగానే వినియోగదారులు ఎక్కువగా ఈ కార్లను ఇష్టపడుతూ ఉంటారు. ఇది కస్టమర్ల దృష్టిని కూడా మరింత ఆకర్షించడం కోసం మారుతీ సుజుకి సంస్థ కొత్త కొత్త కార్లను అత్యధిక ఫీచర్లతో పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు ఈ కంపెనీ తన కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఐదు కొత్త మోడళ్లపై దృష్టిని సారించింది. వీటి ధర రూ. 10 లక్షల కంటే తక్కువగా ఉంటుందని అంచనా.
రాబోయే కార్ల జాబితాలో అప్డేట్ చేసిన ఫ్రంట్లు, కొత్త తరం డిజైర్, కొత్త తరం బాలెనో, కొత్త మైక్రో SUV , కొత్త కాంపాక్ట్ MPV లుగా ఉన్నాయి. మరి ఈ ఐదు కొత్త వాహనాల ప్రత్యేకతలు ఏంటి అన్న విషయానికి వస్తే.. కొత్త డిజైర్ విక్రయం మరికొద్ది నెలల్లో ప్రారంభం అవుతుంది. దీనికి మెరుగైన డిజైన్, ఇంటీరియల్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ సెడాన్ 1.2 లీటర్, జిల్లా సిరీస్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఇది 82 bhp శక్తిని, 112 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపిక ఉంటుంది. ఇది కాకుండా ఈ కారు CNG ఇంధన ఎంపికతో కూడా వస్తుంది. అలాగే….???సంవత్సరంలో ప్రారంభమవుతుంది. ఇది కొత్త హైబ్రిడ్ సిస్టమ్ తో వస్తోంది. అయితే ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉంది.
కారు డిజైన్, ఇంటీరియర్ లో స్వల్ప మార్పులు చేయవచ్చు. ఇక కొత్త మారుతి కాంపాక్ట్ ఎంపీవీ ని విడుదల చేస్తోంది మారుతి సుజుకి. ఇది 2026 నాటికి విడుదల కానుంది. దీనికి YDB అనే కోడ్నేమ్ ఇవ్వబడింది. ఇందులో మూడు వరుసల సీటింగ్ ఏర్పాటు ఉంటుంది. ఈ కారు కంపెనీ లైనప్లో ఎర్టిగా, XL6 కంటే తక్కువగా ఉంటుంది. దీనిని 1.2 లీటర్ జిల్లా సిరీస్ పెట్రోల్ ఇంజన్తో అందించవచ్చు. ఈ ఇంజన్ కొత్త స్విఫ్ట్ లో కూడా అందుబాటులో ఉంది. ఇకపోతే మారుతి కొత్త మైక్రో ఎస్యూవీ విషయానికి వస్తే..
మారుతి సుజుకి లైనప్ లో కొత్త మైక్రో ఎస్యూవీ కూడా జోడించనుంది. దీనికి వై43 అనే కోడ్నేమ్ ఇచ్చింది కంపెనీ. ఈ ఎంట్రీ లెవల్ ఎస్యూవీ 2026, 27 మధ్య భారత మార్కెట్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభించిన తర్వాత, ఇది టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్సెటర్ వంటి కార్లతో పోటీపడుతుంది. అదేవిదంగా కొత్త తరం మారుతి బాలెనో ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. బలమైన హైబ్రిడ్ సిస్టమ్ తో వచ్చే కంపెనీకి చెందిన కార్లలో ఇది చేర్చబడుతుంది. 2026 నాటికి కొత్త బాలెనో భారత మార్కెట్లోకి విడుదల కానుందట.